DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రధాని సహాయ నిధి కి స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు రూ 100 కోట్లు విరాళం

*ఆర్థికరంగం లోనే కాదు ఆపన్నహస్తమూ అందించగలం :ఎస్ బి ఐ*

*అత్యధిక శాఖలున్న బ్యాంకు ఉదార గుణం లోనూ  à°…ధికమే. . .*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). .

.*

ముంబై / విశాఖపట్నం, మార్చి 31, 2020 (డి ఎన్ ఎస్) : దేశ ఆర్ధిక రంగానికి ఒక దిగ్గజంగా చెప్పబడే భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు రెండో రోజుల వేతనాన్ని ప్రధానమంత్రి

సహాయ నిధికి  అందిస్తున్నట్టు చైర్మన్ రజనీష్ కుమార్  à°¤à±†à°²à°¿à°¯à°šà±‡à°¸à°¾à°°à±.   à°†à°°à±à°¥à°¿à°•à°°à°‚à°—à°‚ లోనే కాదు, తాము ఆపద సమయంలో ఆపన్న హస్తమూ అందించగలమని తమ బ్యాంకు ఉద్యోగులు తమ

సుహృదయాన్ని చాటుకున్నారు. 

దేశ వ్యాప్తంగా 256000 మంది ఉద్యోగులు తమ రెండు రోజుల వేతనాన్ని కరోనా మహమ్మారి కట్టడికి విరాళంగా ప్రధాన మంత్రి సహాయ నిధికి

అందించనున్నారు. ఈ మొత్తం రూ. 100 కోట్లు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ధిక పరంగా దేశ ప్రజలు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులకు తమ సేవల్లో వెసులు బాటు కూడా

కల్పించినట్టు తెలిపారు. 2019 -20  à°†à°°à±à°§à°¿à°• సంవత్సరానికి గాను వచ్చిన బ్యాంకు లాభాల్లో 0 .25 శాతం వాటాను కోవిడ్ 19 నివారణ కోసం ఇప్పడికే సామజిక బాధ్యతల్లో భాగంగా అందించడం

జరిగిందన్నారు. దీనికి అదనంగా తమ ఉద్యోగులు స్వచ్చందంగా రెండు రోజుల వేతనాన్ని ప్రధాన మంత్రి సహాయ నిధికి అందించేందుకు ముందుకు రావడం హర్షణీయం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam