DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఢిల్లీ నుండి వచ్చిన వారిపై దృష్టి సారించాలి: సి ఎస్ నీలం 

*వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ల కు సూచన.* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 01, 2020 (డి ఎన్ ఎస్) : ఢిల్లీ నుండి జిల్లాకు

వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టిని సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కరోనా నియంత్రణ

చర్యలపై జిల్లా కలెక్టర్ లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  à°ˆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా పరీక్షల వ్యూహం మార్చడం

జరుగుతుందని పేర్కొన్నారు. పొడి దగ్గు, ఊపిరి పీల్చడంలో కష్టంగా ఉండటం, జ్వరం, గొంతు నొప్పి లక్షణాలు కరోనా వైరస్ వలన వచ్చే అవకాశాలుగా కనిపిస్తున్నాయన్నారు.

కావున వాటిపై దృష్టి సారించాలని, క్వారంటీన్ లో ఉన్నవారిని నిశితంగా పరిశీలించాలని ఆమె ఆదేశించారు. ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం విధిగా పాటించాలని ఆమె సూచించారు.

ఎక్కడా రద్దీ ఉండరాదని, విదేశాల నుండి వచ్చిన వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆమె కోరారు. జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు.

కరోనా వ్యాప్తి జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆమె అధికారులకు సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వ

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా కె. ఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ ట్రాకింగ్ ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోరాదని సూచించారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక

దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఏ.ఎన్.ఎం, ఆశా కార్యకర్త, వాలంటీర్ కలసి ఇంటింటి సర్వే చేయాలని చెప్పారు.

ఈ వీడియో సమావేశంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె

నివాస్, సంయుక్త కలెక్టర్ à°¡à°¾. కె. శ్రీనివాసులు,  à°¸à±€à°¤à°‚పేట సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రోజెక్ట్ అధికారి సిఎం.సాయికాంత్ వర్మ, సహాయ కలెక్టర్ ఏ.భార్గవ తేజ,

 à°¸à°‚యుక్త కలెక్టర్-2 ఆర్.గున్నయ్య, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, కరోనా ప్రత్యేక అధికారి జి.శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి à°¡à°¾.

à°Žà°‚.చెంచయ్య, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటిండెంట్  à°¡à°¾ కె.కృష్ణమూర్తి, à°¡à°¿.సి.హెచ్.ఎస్ బి.సూర్యారావు,  à°œà°¿à°²à±à°²à°¾ పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి జి.చక్రధరరావు,

నగర పాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య,  à°Žà°•à±à°¸à±ˆà°œà± శాఖ ఉప కమీషనర్  à°¸à±à°•à±‡à°¶à±, జిల్లా పంచాయతీ అధికారి వి.వి.రవికుమార్, జిల్లా విపత్తుల విభాగం ఇన్ ఛార్జ్ జిల్లా మేనేజర్

బి.నాగేష్, మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam