DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రామ నవమి వేడుకల్లో కూడా కనీస దూరం పాటిద్దాం: రాష్ట్రపతి. 

*దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుభాకాంక్షలు*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

ఢిల్లీ /  à°µà°¿à°¶à°¾à°–పట్నం, ఏప్రిల్ 01, 2020 (డిఎన్ఎస్) :

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “పవిత్ర శ్రీరామనవమి పర్వదినం నేపథ్యంలో దేశ పౌరులందరికీ

నా శుభకామనలు తెలియజేస్తున్నాను” అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని జన్మతిథి సందర్భంగా దేశమంతటా ప్రజలు వేడుకలు

చేసుకుంటారు. అలాగే ఇది పంటలు ఇళ్లకు చేరే సమయం కావడంతో ఆరుగాలం చెమటోడ్చే  à°°à±ˆà°¤à± సోదరులు కూడా సంబరాల్లో నిమగ్నమవుతారు. కాగా, “శ్రీరాముని ఆదర్శప్రాయం జీవనం

మనకు సత్ప్రవర్తన, సహనం, సామరస్యం, సౌహార్దలతో కూడిన సందేశాన్నిస్తుంది. నిత్య నూతనమైన ఈ విలువలను మన కర్తవ్య నిర్వహణలో చిత్తశుద్ధితో పాటించాలి. ఆ మహనీయుడు చూపిన

ఆదర్శాల బాటలో ఉజ్వల నవభారత నిర్మాణానికి à°ˆ రామనవమి పర్వదినంనాడు సంకల్పం పూనుదాం. పండుగ సంబరాలు చేసుకోవడంతోపాటు ప్రపంచ మహమ్మారి కోవిడ్‌-19 వైరస్‌పై పోరాటంలో

భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన ‘కనీస దూరం’ వంటి మార్గదర్శకాలను తూచా తప్పుకుండా పాటిద్దాం” అని రాష్ట్రపతి తన సందేశంలో ప్రజలకు పిలుపునిచ్చారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam