DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆసుపత్రి నుంచి ఆరోగ్యవంతునిగా ఇంటికి తూగో జిల్లా తొలి బాధితుడు

*అభినందించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యులు.*

*జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి సురక్షితులే.: కలక్టర్* 

*లాక్ డౌన్ మీ రక్షణ కోసమే. . : ఎస్పీ

నయీమ్* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి, ఏప్రిల్ 03, 2020 (డి ఎన్ ఎస్) : విదేశాల నుంచి వచ్చి కరోనా బారిన పడిన తూర్పు గోదావరి జిల్లా

బాధితుడు ఆరోగ్యవంతునిగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నట్టు జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తెలియచేసారు. శుక్రవారం కాకినాడ ప్రభుత్వ

ఆసుపత్రి వద్ద అతనికి à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్ మురళీధర్ రెడ్డి,  జిల్లా పోలీస్ ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, కాకినాడ లోక్ సభ సభ్యురాలు వి. గీత విశ్వనాధ్, కాకినాడ శాసన

సభ్యులు à°¡à°¿. చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అభినందనలు తెలియచేయడం జరిగిందన్నారు. 

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ అనుక్షణం వైద్య పర్యవేక్షణ

చేసిన ఆసుపత్రి వైద్యులు, సమయానికి స్పందించిన ఆరోగ్య సిబ్బంది, మునిసిపల్ సిబ్బంది అందరికి అభినందనలు తెలిపారు. కరోనా బారిన పడకుండా కనీస జాగ్రత్తలైన

పరిశుభ్రత, ఎప్పడికప్పుడు చేతులు కడుక్కోవడం, ప్రక్కవారితో కనీస దూరం పాటించడం, తుమ్ము, దగ్గు, వచ్చినపుడు చేతి రుమాలు అడ్డం పెట్టుకోవడం లాంటి జాగ్రత్తలు

తీసుకుంటే మహమ్మారి బారిన పడకుండా సురక్షితులు కావచ్చన్నారు. ఎటువంటి అనారోగ్య ఇబ్బంది కల్గిన తక్షణం వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. 

లాక్

డౌన్ మీ రక్షణ కోసమే. . : ఎస్పీ నయీమ్ 

కరోనా మహమ్మారి విస్తరించకుండా చెయ్యడం కోసమే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిందని జిల్లా పోలీస్ ఎస్పీ అద్నాన్

నయీమ్ అస్మి సూచించారు. ప్రతి రోజు  à°‰à°¦à°¯à°‚ ఇచ్చిన వెసులు బాటు సమయాన్ని కేవలం అవసరం మేరకు మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలని తెలిపారు. పోలీస్ సిబ్బందికి

సహకరించాలకు కోరారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసమే వేలాది మంది ప్రభుత్వ సిబ్బంది ఇల్లు వదిలి రోడ్లపై విధులు నిర్వహిస్తున్నారని, వారికి సహకరించడం కనీస భాద్యత

అన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam