DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా వసతి గృహాలను ఉపయోగించుకోవాలి: కలెక్టర్ 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 03, 2020 (డి ఎన్ ఎస్) : కరోనా లాక్ డౌన్ కారణంగా జిల్లా నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళలేని వారికి

ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటు చేసామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆశ్రయం లేని వారు ఎవరైనా ఈ గృహాల్లో ఉండవచ్చని ఆయన

చెప్పారు. భోజన, వసతి ఏర్పాట్లను ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. శ్రీకాకుళంలో 7 రోడ్ల జంక్షన్ వద్ద వై.యస్.ఆర్ కళ్యాణ మండపం, అంబేద్కర్ జంక్షన్ వద్ద

రెవిన్యూ గెస్టు హౌస్, జెడ్పీ ఎదురుగాగల హెచ్.బి కాలనీ వద్ద అంబేద్కర్ భవన్ లో వసతి గృహాలు ఏర్పాటు చేసామన్నారు. ఈ గృహాల్లో ఆశ్రయం కావలసిన వారు 08942 229080 నంబరుకు ఫోన్

చేయవచ్చని ఆయన చెప్పారు. మండలాల్లో వసతి కావలసిన వారు మండల తహశీల్దారును సంప్రదించవచ్చని చెప్పారు. 

మార్కెట్లలో ఆది వారం రద్దీ వద్దు

ఆది వారం

మార్కెట్లలో రద్దీ వద్దని జిల్లా కలెక్టర్ నివాస్ కోరారు. గత వారం మార్కెట్ల వద్ద వ్యక్తిగత దూరం పాటించడంలో విఫలం చెందారని తద్వారా కరోనా వ్యాప్తికి అవకాశాలు

ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నివారణను దృష్టిలో పెట్టుకుని రద్దీ ఎక్కడా లేకుండా సంయమనం పాటించాలని కోరారు. ముఖ్యంగా మాంసం, చేపల దుకాణాల వద్ద ప్రజలు

గుమి గూడటం జరుగుతోందని దానిని నివారించాలని అన్నారు. జిల్లాలో 144వ సెక్షన్ అమలులో ఉందని, ఎక్కడా ఐదు గురు కంటే ఎక్కువ ఉండరాదని పేర్కొన్నారు. ఓబిఎస్ వద్దగల చేపల

మార్కెట్ ను 80 అడుగుల రహదారికి మార్చడం జరిగిందని, వ్యక్తుల మధ్య దూరం పాటించుటకు మార్కింగు చేసామని దానిని పాటించాలని విజ్ఞప్తి చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam