DNS Media | Latest News, Breaking News And Update In Telugu

7న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 03, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్):  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ à°ˆ నెల 7à°¨ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు

ఏ.పి.మార్కెఫెడ్ శ్రీకాకుళం జిల్లా మేనేజర్ కె.యు.పి.రమణి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసారు. సంయుక్త కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని

శ్రీకాకుళం,పొందూరు,రాజాం,పాతపట్నం మరియు కొత్తూరు మార్కెట్ కమీటీల వద్ద మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని, వీటిని మార్కెఫెడ్

ఏర్పాటుచేస్తున్నట్లు ఆమె చెప్పారు. మొక్కజొన్నకు క్వింటా ఒక్కంటికి రూ.1760/-ల మద్ధతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు పేర్కొన్నారు. రైతు సోదరులు తమ పంటను

బాగా ఆరబెట్టి, ఇంటివద్దనే శుభ్రపరచి 14శాతంలోపు తేమ ఉండేవిధంగా చూసుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని చెప్పారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వచ్చినపుడు

పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు పాసుపుస్తకంతో పాటు ఆధార్ నకళ్లను తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేని పంటను, తడిచిన లేదా

పురుగుపట్టిన మొక్కజొన్నను కొనుగోలు చేయబడదని స్పష్టం చేసారు. రైతులు  à°ˆ విషయాన్ని గమనించి దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాల వద్ద తమ పంటను అమ్మి

సరైన మద్ధతు ధరను పొందాలని సూచించారు. కోనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్న మద్ధతు ధర సొమ్ము నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమచేయబడుతుందని ఆ

ప్రకటనలో వివరించారు. కావున జిల్లాలోని మొక్కజొన్న రైతులు à°ˆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె à°† ప్రకటనలో కోరారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam