DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ 19 అదుపుకై సత్యసాయి ట్రస్ట్ రూ. 10 కోట్లు విరాళం 

*పీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 5 కోట్లు, సిఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 5 కోట్లు*    

*సీఎంకు నేరుగా చెక్ అందించిన సెంట్రల్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్*   

*14

 à°•à±à°µà°¾à°°à°‚టైన్ కేంద్రాలకు రూ .2 కోట్ల విలువ వైద్య సామాగ్రి*

*కోవిద్ పై పోరాటానికి సంపూర్ణ సహకారం అందిస్తామని సీఎం కు హామీ*

*ఏపీ సంస్థల నుంచి లక్షకు పైగా

మాస్క్ à°² అందజేత. . . .* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 04, 2020 (డిఎన్ఎస్) : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ని

విస్తరించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు ఇతోధిక సాయంగా శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ రూ. 10 కోట్ల విరాళాలను ప్రకటించింది. భారత

 à°ªà±à°°à°§à°¾à°¨à°¿ పిలుపు మేరకు శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ స్పందించి,  à°ªà°¿à°Žà°‚ కేర్స్ ఫండ్ (కోవిడ్ 19 రిలీఫ్ ఫండ్) కు  à°°à±‚. 5  à°•à±‹à°Ÿà±à°² రూపాయలను అందించగా, ఆంధ్ర ప్రదేశ్

ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు రూ. 5  à°•à±‹à°Ÿà±à°² రూపాయలను అందించింది.  à°ˆ మేరకు ఏపీ మీడియా రిలేషన్స్ సమన్వయకర్త ద్వారం స్వామి à°’à°• ప్రకటన విడుదల చేసారు. 

శనివారం

విజయవాడలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ తరపున మేనేజింగ్ ట్రస్టీ ఆర్ జె రత్నాకర్ రూ. 5

కోట్ల విరాళాన్ని అందించారు. ఈ సందర్బంగా కోవిడ్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని రత్నాకర్

తెలియచేసారు. ఇప్పడికే తమ దేశ, విదేశాల్లో ఉన్న సత్యసాయి సేవా సంస్థలు, వాటి అనుబంధ శాఖలు ప్రత్యక్షంగా ప్రజలకు సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. 

ఏపీ నుంచి

లక్షకు పైగా మాస్క్ à°² అందజేత. . .. 

సత్యసాయి మహిళా సమితి ఆంధ్ర ప్రదేశ్ విభాగం సభ్యులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి భారీ ఎత్తున మాస్క్ లను తయారు చేసి కేరళ లోని పలు

ప్రాంతాలకు, గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వైద్య సిబ్బంది, పారిశుధ్య విభాగ సిబ్బందికి ఇప్పడికే అందించడం జరిగిందని ముఖ్యమంత్రి కి

తెలిపారు.   

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనెలకొని ఉన్న అత్యవసర వైద్య పరిస్థితులపై పోరాడటానికి శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ తన వంతు సాయంగా మాస్క్ లను, ఆహార

పదార్ధాలను, వైద్య సామాగ్రిని కూడా అందిస్తున్నామన్నారు. 

14  à°•à±à°µà°¾à°°à°‚టైన్ కేంద్రాలు ఏర్పాట్లు - 2 కోట్ల విలువ సామాగ్రి : .. 

అనంతపూర్ జిల్లాలో శ్రీ

సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ 14  à°•à±à°µà°¾à°°à°‚టైన్ కేంద్రాలను ఏర్పాటు చెయ్యడం జరిగిందని తెలిపారు. à°ˆ కేంద్రాలకు శ్రీ సత్యసాయి సెంట్రల్

ట్రస్ట్ అదనంగా రూ .2 కోట్ల విలువైన వైద్య సామాగ్రిని అందచేసినట్టు ముఖ్యమంత్రి à°•à°¿  à°µà°¿à°µà°°à°¿à°‚చారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam