DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పరిస్థితులు అనుకూలించకపోయినా  వేతనాలు చెల్లిస్తాం: సీఎం

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , ఏప్రిల్ 04, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :  à°¨à°¿à°¤à±à°¯à°¾à°µà°¸à°° సేవల్లో నిమగ్నమైన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి

జీతాలు ఇస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తెలిపారు. ఇది వరకటి మాదిరిగా ఉద్యోగులందరికీ ఒకటో తేదీన జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం

విఫలమయింది. ఆ వాయిదా వేసి ఇస్తామన్న వారికి కూడా సగం జీతమే ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కానీ, ఆరోగ్య, పోలీసు, పారిశుద్ధ్య విభాగాల్లో పనిచేసే ప్రభుత్వ

ఉద్యోగులకు మాత్రం పూర్తి జీతాలు లభిస్తాయని సీఎం తెలిపారు. అదే సమయంలో, విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం విస్మరించింది. లాక్‌డౌన్ సమయంలో

ఆసుపత్రులకు, గృహ అవసరాలకు సరైన విద్యుత్ సరఫరా కోసం చిత్తశుద్ధితో పనిచేసిన విద్యుత్ ఉద్యోగులను ప్రభత్వం పట్టించుకోలేదన్న విమర్శలు

వినవస్తున్నాయి.

అధికారులతో రాష్ట్రంలో కొవిడ్-19 పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో, ఈ మూడు విభాగాలలో పనిచేసే ఉద్యోగులకు 100 శాతం జీతం

చెల్లించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా అత్యవసర సేవలందిస్తోన్న వైద్యారోగ్యశాఖ, పోలీసులు,

పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు

జారీ చేశారు. ఈ మూడు కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించాల్సిందిగా ఆర్థికశాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు.

వాస్తవానికి

రాష్ట్రంలో అఖిలభారత సర్వీసు అధికారులకు 60 శాతం మేర, ప్రభుత్వ ఉద్యోగులందరికీ 50 శాతం మేర, నాలుగో తరగతి ఉద్యోగులకు 10 శాతం మేర జీతాలను వాయిదా వేయాలని ప్రభుత్వం

నిర్ణయించింది. అయితే, అత్యవసర సేవల విభాగాలుగా ఈ శాఖలకు చెందిన ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తున్నందున వీరికి పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించాల్సిందిగా సీఎం

ఆదేశించారు. కొవిడ్‌-19 నివారణ చర్యలపై సమీక్షించిన సీఎం à°ˆ సూచనలు చేశారు. కరోనా వైరస్‌ నివారణకు వారు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రం

ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఈ మూడు కేటగిరీలకు సిబ్బందికి పూర్తి జీతాలు చెల్లించాలని, ఈమేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు,

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాత్రి 10.30 à°—à°‚à°Ÿà°² నుంచి శనివారం ఉదయం 10à°—à°‚à°Ÿà°² వరకు

కొత్తగా 16 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 180à°•à°¿ చేరింది. గుంటూరు జిల్లాలో 3, à°•à°¡à°ª జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 4, కర్నూలు

జిల్లాలో 3, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో ఒక్కో కేసు చొప్పున కొత్తగా నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో ఎక్కువ మంది ఢిల్లీలోని జమాత్‌ వెళ్లినవారేనని

అధికారులు గుర్తించారు. కర్నూలు జిల్లాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. కర్నూలు నగరంలోని రోజా వీధి, అవుకు,

బనగానపల్లెలో ఒక్కొ కేసు నమోదైనట్లు వెల్లడించారు. వీరంతా ఢిల్లీలోని మర్కజ్‌లో జరిగిన మత ప్రార్థనలకు హాజరైన వారేని వెల్లడించారు. కర్నూలు జిల్లా నుంచి 449 మంది

ఢిల్లీ జమాత్‌కు వెళ్లారు. ఇంకా 350 మంది రిపోర్టులు రావాల్సి ఉందని కలెక్టర్‌ తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam