DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇద్దరికీ పాజిటివ్, అష్టదిగ్బంధనం లో రాజమండ్రి మునిసిపల్ కోలని

*వైద్య పరీక్షకు బాధితులు తరలింపు, క్వారంటైన్ లోకి వాంబే గృహాలు* 

*500 మీటర్ల పరిధిలో పూర్తిగా à°•à° à°¿à°¨ లాక్ డౌన్ నిబంధనలు* 

*(DNS రిపోర్ట్ : రంగాచార్యులు టి,

 à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్రవరం). . .*

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 05, 2020 (డిఎన్ఎస్) : ఇటీవలే ఢిల్లీ లోని నిజాముద్దీన్ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో ఇద్దరికీ పాజిటివ్ రావడం తో కరోనా

పరీక్షల కోసం వైద్య అధికారులు తరలించిన నేపథ్యంలో రాజమహేంద్రవరం లోని మునిసిపల్ కోలనీ లో అత్యంత కట్టుదిట్టమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసారు. శనివారం ఉదయం ఈ

ఘటనతో ఒక్కసారిగా మునిసిపల్ కోలని మొత్తం అష్టదిగ్బంధనం లోకి వెళ్ళింది. ఇదే ఇంటికి సమీపంలో వాంబే గృహాలు ఉండడంతో సుమారు 500 మీటర్ల పరిధిలో పూర్తి ఆంక్షలను

అమలు చేస్తున్నారు. ఆ ఇళ్లల్లో ఉన్నవారందరినీ గృహ క్వారంటైన్ లోకి వెళ్ళవలసిందిగా ఆదేశించారు. వారికి కావాల్సిన సామాగ్రిని కంట్రోల్ రూమ్ నుంచే అందించే

ప్రయత్నం చేస్తున్నారు. à°† ప్రాంతం వారికి తక్షణం వైద్య పరీక్షలు నిర్వహించారు. 

ఈ మునిసిపల్ కోలనీలోకి వెళ్లేందుకు ఉన్న మార్గాలను పూర్తి గా మూసివేశారు.

ప్రధాన రహదారి కోరుకొండ రోడ్ (మార్కెట్ యార్డ్ నుంచి రాజా ధియేటర్ వరకూ )  à°µà±ˆà°ªà± నుంచి à°’à°• మార్గం, సీతంపేట పేపర్ మిల్లు వైపు నుంచి మరో మార్గం ఉండడంతో మొత్తం à°†

రోడ్లన్నీ పోలీస్ బారీకేడ్లతో బంధించేసారు. కోలనీ లో వీధులన్నీ మొత్తం శానిటైజేషన్ చెయ్యడం కోసం, బ్లీచింగ్ చల్లడం కోసం  à°•à±‹à°²à°¨à±€ లో నుంచి ఎవ్వరినీ బయటకు

వెళ్లనివ్వడం లేదు. ఇల్లిల్లు జల్లెడ పట్టి అనుమానితులుంటే వైద్య పరీక్షలకు తరలిస్తున్నారు. ఈ క్రమం లోనే నగర పాలక సంస్థ ప్రతినిధులు, వైద్య, పారా మెడికల్

సిబ్బంది, పారిశుధ్య విభాగం సిబ్బంది, ఉన్నత స్థాయి అధికారులతో సహా విస్తృతంగా పర్యటిస్తూ ఇల్లిల్లు తనిఖీ చేపడుతున్నారు. ఈ క్రమం లోనే లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో

కేవలం ఉదయం పూటే నిత్యావసరాల కోసం బయట కు వచ్చిన కోలని నివాసులను à°ˆ పోలీస్ బారికేడ్లు దాటి బయటకు వెళ్లనివ్వలేదు. దీనిపై కోలని వాసులకు  à°ªà±‚ర్తి అవగాహనా

కల్పిస్తున్నారు. ఇది ప్రజా రక్షణ కోసమేనని, ప్రజలు పూర్తిగా సహకరించాలని తెలియ చేస్తున్నారు. 

ఈ క్రమంలోనే ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా రసాయన

ద్రావకాన్ని అంగుళం అంగుళం ప్రాంతంలోనూ పిచికారీ చేస్తున్నారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వ అధికార సిబ్బంది వెళ్లి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి నుంచి ఎవ్వరూ బయటకు

రావద్దని సూచించారు. ఎక్కడికక్కడ మైక్ ల ద్వారా ప్రచారాన్ని స్వయంగా పోలీసు సిబ్బందే నిర్వహిస్తున్నారు. తెలియక బయటకు వచ్చిన వారికి నచ్చ చెప్పి, తిరిగి

పంపుతున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam