DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అందరికీ ఆదర్శం విశాఖ సప్తఋషి వేదపాఠశాల బృందం* 

*à°’à°• ప్రక్క యజ్ఞ యాగాదులు - మరో ప్రక్క నిత్యాన్న ప్రసాద వితరణ* 

*కరోనా క్రిమి నాశనానికి ధన్వంతరి హోమం, జపతపాదులు* 

*గ్రామాల్లో అన్నార్తులకు సంతుష్ట

ప్రసాద వితరణ* 

*సమాజ శ్రేయస్సే మా లక్ష్యం: ప్రిన్సిపాల్ మాధవశర్మ* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 05, 2020 (డిఎన్ఎస్) :

విశాఖనగరం శివారు ప్రాంతం లోని సప్తఋషి వేదపాఠశాల బృందం యావత్ సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. బ్రహ్మశ్రీ మావిళ్ళపల్లి మాధవ శర్మ నేతృత్వంలో

నిర్వహించబడుతున్న ఈ వేదపాఠశాలలోచిన్నారి వేద విద్యార్థులచే నిరంతరం యజ్ఞ యాగాదులు, జపతపాదులు నిర్వహిస్తూ, మరో ప్రక్క గ్రామాల్లోని అన్నార్తులకు అన్న

ప్రసాదాన్ని పాఠశాలలోనే తయారు చేసి, స్వయంగా అందరికి అందిస్తున్నారు. 

ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు యావత్ సమాజం శ్రేయస్సు కోరుతూ

ధన్వంతరి హోమం, జపతాపాలు దివారాత్రాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో సమీప గ్రామాల్లోని ప్రజలు, లాక్ డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితం కావడంతో ఆదాయం లేక, ఇబ్బంది

పడుతున్న అన్నార్తుల వద్దకే ఈ పాఠశాల బృందాలు వెళ్లి ప్రతి రోజూ ఆహారాన్ని అందిస్తున్నాయి. ఇదే సమయంలో విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది ని కూడా ఆప్యాయంగా

పలుకరిస్తూ వారికి కూడా ప్రసాదాన్ని అందిస్తూ అందరి మన్ననలూ పొందుతున్నారు.  

à°ˆ సందర్భంగా సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు, వేద పాఠశాల  à°ªà±à°°à°¿à°¨à±à°¸à°¿à°ªà°¾à°²à±

బ్రహ్మశ్రీ మావుళ్ళ పల్లి మాధవశర్మ మాట్లాడుతూ  à°¸à°®à°¾à°œ శ్రేయస్సు కోసం వేదవిద్యార్ధులతో నిరంతరం వేదపఠనం చేయిస్తున్నామన్నారు. సమాజం లో మేము కూడా భాగమని, సమాజం

లోని ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలి అని ఏకైక సంకల్పంతో నిరంతరం గత నెల 23 నుంచి క్రిమి రోగ సంహారక సూక్త హోమాన్ని చేపట్టామని, లక్ష ధన్వంతరి హోమాన్ని

జరుపుతున్నట్టు తెలిపారు. అదే సమయంలో ఆకలి బాధతో ఎవరూ జీవనాన్ని సాగించకూడదని, తమ పరిసర ప్రాంతాల్లో సాధ్యమైనంత మందికి అన్న ప్రసాదాన్ని, మంచి నీరు వాహనాల ద్వారా

ప్రజల వద్దకే వెళ్లి అందిస్తున్నామన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam