DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవసాన దశ లో విశాఖ కాంగ్రెస్... కాకలు తీరిన నేత బొలిశెట్టి రాజీనామా 

విశాఖపట్నం, జులై 1 , 2018 (DNS ONLINE ): విశాఖ నగరం లో కాంగ్రెస్ అవసాన దశకు చేరుకుందనడానికి మరో నిదర్శనం బహిర్గతమైంది. నగర కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న పారిశ్రామిక

వేత్త బొలిశెట్టి సత్యన్నారాయణ ఆదివారం రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి అయన తన రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్ పార్టీ కి తొలినాళ్ళ

నుంచీ ఎంతో కృషి చేసిన తనకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వని కారణం గానూ, గతం లో పార్టీకి ద్రోహం చేసిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకు రావడం పై పార్టీ అధిష్ఠానానికి

ఉన్న శ్రద్ధ పార్టీ  à°…వసాన దశ లో ఉన్న పార్టీ అభివృద్ధి à°•à°¿ కృషి చేసి, జీవం పోస్తున్న తనలాంటి వాళ్ళ పై లేనందున, తానూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా  à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨à°Ÿà±à°Ÿà±

ప్రకటించారు.  à°ˆà°¯à°¨à°¤à±‹ పాటు భారీ సంఖ్యలో మిగిలిన కాంగ్రెస్ క్యాడర్ పార్టీ à°•à°¿ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. 

చంద్రబాబు పై ప్రత్యక్ష

పోరాటం చేసిన ఏకైక వ్యక్తి బొలిశెట్టి. రాజధాని నిర్మాణం లో జరిగిన ప్రతీ అక్రమాన్ని తప్పు ఎత్తిచూపి ఏకంగా సుప్రీం కోర్టులో సైతం న్యాయ పోరాటం చేసి, కాంగ్రెస్

పార్టీకి పూర్వపు వైభవాన్ని తీసుకువచ్చిన వ్యక్తి ఈయనే. రాజధాని పై పోరాటం లో భాగం గా వ్యక్తిగతం గా సర్వ్ చేయించి, నిపుణులచే విచారణ జరిపించి, అక్రమాలను

బహిరంగంగానే తెలిపి, ముఖ్యమంత్రి పై ప్రత్యక్ష విమర్శలు సైతం జరిపిన నేతకు కాంగ్రెస్ పార్టీ మంచి బహుమానం ఇచ్చిందనే చెప్పుకోవాలి. రాజధాని అమరావతి నిర్మాణం పై

ఈయన చేసిన కృషి మరేదైనా పార్టీ నేతలు జరిపి ఉంటె, వారికి అగ్రస్థానం లభించి ఉండేది అన్నది వాస్తవం. అలాంటిది కాంగ్రెస్ పార్టీ ఈయన్ని పూర్తిగా ప్రక్కన పెట్టడం

గమనార్హం.

తదుపరి తన కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బొలిశెట్టి సత్యన్నారాయణ  à°œà°¨à°¸à±‡à°¨ పార్టీ లో చేసే

అవకాశాలున్నాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam