DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇదే అఖండ భారతం.. పాలకుని పిలుపు - పాలితుల ఆచరణ 

*గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారతం దేదీప్తియంగా వెలిగిపోతోంది* 

 

à°…à°–à°‚à°¡  à°—ోదావరి  à°¤à±€à°°à°‚లో అలా . . à°¸à°¾à°—à°° తీరంలో ఇలా . . .

భారతంలోనే కాక. . ఖండాంతరాల్లో సైతం

దీప ప్రజ్వలన   

 

(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , ఏప్రిల్ 05, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : పాలకుని ఒక్క పిలుపు కు మొత్తం యావద్భారతం

పలికింది, విశ్వం పులకరించి పోయింది. ఆదివారం జరిగిన దీప ప్రజ్వలన కార్యక్రమమే à°…à°–à°‚à°¡ భారతం కు ప్రత్యక్ష నిదర్శనం. 

కరోనా మహమ్మారి ని పారద్రోలేందుకు

భారతీయులంతా ఒకే మాటపై కంకణ బద్ధులై ఉన్నారు అని నిరూపించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు గ్రామాల్లోని గల్లీల

నుంచి రాజధాని ఢిల్లీ వరకూ మొత్తం అన్ని వీధుల్లోని ఇల్లూ దేదీప్యమానంగా దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ కాంతుల్లో వెలిగి పోయింది. 

à°…à°–à°‚à°¡  à°—ోదావరి  à°¤à±€à°°à°‚లో : . .

.

జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం గోదావరీ తీరంలో అత్యంత వైభవంగా సాగింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని పుష్కరాల రేవులో కరోనా విధుల్లో ఉన్న

సిబ్బంది తో కలిసి అతి తక్కువ మంది మహిళలు మొత్తం దీపాలతో దేదీప్యమానం చేశారు. నగర వీధులు సైతం జ్యోతి ప్రజ్వలన వెలిగిపోయింది. 

తూర్పు గోదావరి జిల్లా

కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బంగ్లాలోను, జిల్లా ఎస్పీ నయీమ్ బృందం జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణ లో కొవ్వొత్తులు, కాగడాలను వెలిగించి దేశ

ఐక్యతను చాటారు. 

సామాజిక కార్యకర్త మధర్ సేవా సంస్థ అధ్యక్షురాలు లీలా ప్రశాంతి ఆద్వర్యంలో గుడారిగుంట మున్సిపల్ స్కూల్ దగ్గర భారతదేశ ప్రధాని మోడి

పిలుపు మేరకు భారత దేశ మ్యాప్ ఆకారంలో దీపాలు వెలిగించారు. 

బిజెపి కాకినాడ నగర అధ్యక్షుడు చిట్నీడి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి భారత మాత చిత్రపటం

ముందు భారత దేశ పట  à°†à°•à°¾à°°à°‚లో దీపాలను వెలిగించారు.  

సీనియర్ పాత్రికేయులు పెంటపాటి రాజా తన నివాసం లో కొవ్వొత్తులు వెలిగించి దేశ ఐక్యతను చాటారు. 

రెడ్

జోన్ à°—à°¾ ప్రకటించబడి, à°—à°¤ రెండు రోజులుగా పూర్తిగా పోలీస్ నిర్బంధం లో ఉన్న మునిసిపల్ కోలనీ లో సైతం  à°šà°¿à°¨à±à°¨à°¾à°°à±à°²à±, యువతీ యువకులు, మహిళలూ మెడలపైకి ఎక్కి సంప్రదాయ

బద్దంగా దీపాలను వెలిగించి శాంతి శ్లోకాలను పఠించారు.

సాగర తీరంలో . . .  

అత్యంత విశాల సాగర తీర నగరమైన విశాఖపట్నంలో ప్రతి వీధి, వీధి లోనూ ప్రతి ఇంట్లోనూ

ప్రమిదలను వెలిగించి ప్రధాని పిలుపుకు సంఘీభావాన్ని ప్రకటించారు. రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 9 నిమిషాల వరకూ దీప ప్రజ్వలన చేసారు. ప్రధానంగా అపార్ట్మెంట్ వాసులు

బాల్కనీలను జ్యోతులతోను, కొవ్వోత్తులతోనూ నింపి దేదీప్యమానంగా మార్చారు. 

జిల్లా కలెక్టర్ వినయ్ చాంద్ కుటుంబ సభ్యులు, సంయుక్త కలెక్టర్ శివశంకర్ కుటుంబ

సభ్యులతో కలిసి కొవ్వొత్తులను వెలిగించారు.

బెంగుళూరు. . .మహా నగరం లో సైతం దీప ప్రజ్వలన లో మూడేళ్ళ వయసు కల్గిన చిన్నారి సైతం పాల్గొని, ప్రధాని మాటకు దేశ

ప్రజలంతా కట్టుబడి ఉన్నారు అని నిరూపించింది. 

ఖండాంతరం లోనూ. . .

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని

ఖండాంతరాల్లో సైతం భారతీయులు నిర్వహించారు. ఉత్తర అమెరికా లోని కెనడా దేశంలో గల బ్రంప్టాన్ నగరం లోని భారతీయ కుటుంబాలు చిన్నారులతో కలిసి ఇదే సమయానికి తమ ఇళ్ల

ఆవరణలో దీప ప్రజ్వలన చేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam