DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అఖండ భారతానికి ఐక్యతకు అద్దం పట్టే దృశ్యాలు ఇవే. . . .

*పహారా లో ఉన్న వారి నుంచి . . పాకల్లో ఉండేవారి దాకా. . .* 

*కోటీశ్వరుని నుంచి కష్ట జీవి వరకూ భారతావని ఐక్యతను చాటారు* 

*నరేంద్రుడు ఒక పార్టీ నేత కాదు . .

యావద్భారత దేశ నాయకుడు*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 06, 2020 (డిఎన్ఎస్) : దేశ పాలకుని గా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఒక్క

పిలుపు కు మొత్తం యావద్భారతం అడుగులు వేసింది. విశ్వం పులకరించి పోయింది. ఆదివారం జరిగిన దీప ప్రజ్వలన కార్యక్రమమే అఖండ భారతం కు ప్రత్యక్ష

నిదర్శనం. 

సాధువుల నుంచి భక్తుల వరకూ, రతన్ టాటా వంటి కోటీశ్వరుని నుంచి కాయకష్టం చేసుకునే సామాన్యుల వరకూ, పహారా లో ఉన్న భారత సైనికుల నుంచి సామాన్య ప్రజల

వరకూ, సాంసృతిక కళాకారుల నుంచి  à°¸à°¿à°¨à±€ వర్గాల వరకూ. . . à°ˆ దీప ప్రజ్వలనతో పాల్గొని దేశ ఐక్యతను చాటారు. 

అందరికీ స్ఫూర్తిగా మతాలకు అతీతంగా హిందువులు, ముస్లిం

ప్రతినిధులు కూడా à°ˆ కార్యక్రమం లో పాల్గొని దేశ ఐక్యతలో తాము కూడా భాగస్వాములేనని నిరూపించారు. 

రాజకీయాల పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలూ ప్రధాని

నరేంద్ర మోడీ పిలుపుకు సంఘీభావాన్ని ప్రకటించారు. వారిలో చాలా మంది నరేంద్రునికి ఓటు వేసి ఉండక పోవచ్చు, అయినప్పటికీ దేశ సౌభాగ్యం కోసం ఆయన పిలుపుకు అందరూ

మద్దతు ప్రకటించారు. 

*నరేంద్రుడు ఒక పార్టీ నేత కాదు . . యావద్భారత దేశ నాయకుడు

నరేంద్ర మోడీ కేవలం ఒక రాజకీయ పార్టీకి చెందిన నేత మాత్రమే కాదని,

దేశాన్ని సమర్ధవంతంగా నడిపించగల  à°¦à±‡à°¶ నాయకుడు అని నిరూపితమైంది. ఆయన ఏ ఒక్క పార్టీకో మాత్రమే అనుకూలంగా వ్యవహరించడం లేదు, యావత్ భారత ప్రజలందరూ తన కుటుంబ

సభ్యులేనని ప్రకటించి, వారి రక్షణ కోసం అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుని, తన నిర్ణయం పట్ల ప్రజలను ఒప్పించగలిగారు. గత పది రోజులుగా ఇళ్లకే పరిమితమైనప్పడికే

ప్రజలెవ్వరూ విమర్శలు చెయ్యడం లేదు, కారణం ప్రస్తుతం అయన తీసుకున్న నిర్ణయం దేశ రక్షణకే అని అందరికీ తెలుసు కనుక. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam