DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వానికి ప్రయివేట్ వైద్యుల సహకారం భేష్. . .*

*రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ అభిషిక్త్ కిషోర్.*

*ఒపి లు, నాన్ ఎమర్జెన్సీ సేవలు నిలిపేశాం : వైద్య సంఘం.* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్,

అమరావతి :). . .*

అమరావతి, ఏప్రిల్ 06, 2020 (డి ఎన్ ఎస్) : అత్యంత విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న వైద్య సంబంధిత కార్యాచరణకు ప్రయివేట్

వైద్యుల సహకారం అందించడం అభినందనీయమని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ అభిషిక్త్ కిషోర్ తెలియచేస్తున్నారు. సోమవారం తనను కలిసిన

ప్రయివేట్ వైద్యుల బృందం తాము అందించే సహకారాన్ని కమిషనర్ కు వివరించింది. 

ప్రతి రోజు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు నిర్వహిస్తున్న సమీక్ష

సమావేశంలో రాజమహేంద్రవరం ఐ ఎం ఏ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొని, సూచనలు అందిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎప్పడికప్పుడు ప్రయివేట్

వైద్యులందరికి అందిస్తున్నట్టు తెలిపారు. తమ సంఘం ద్వారా రూ. 15 లక్షలు వివువైన పీపీఈ లు, శానిటైజర్లు, ఇతర రక్షణ సామాగ్రి కొనుగోలు చేసి, కోవిడ్ ఆసుపత్రుల్లోని

వైద్య సిబ్బందికి అందించే ఏర్పాట్లు చేశామన్నారు. కోవిడ్ లక్షణాలు గమనించిన వెంటనే వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలకు తరలించాలని అందరికి

తెలియచేయడం జరిగిందన్నారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ మహమ్మారిని పూర్తిగా అరికట్టేందుకు అన్ని ప్రయివేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ సాధారణ  à°’పి లు,

నాన్ ఎమర్జెన్సీ సేవలు నిలిపేసినట్టు ఈ వైద్య సంఘం ప్రతినిధులు తెలియచేసారు. ప్రతి ఆసుపత్రిలోనూ వైద్యులు ఫోన్ ల ద్వారా ప్రజలకు ఈ మహమ్మారి అదుపునకై

తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియచేస్తూ, అపోహలను పోగెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. 

ముందుగా ఏ పేషెంట్ అయినా ఆసుపత్రికి వచ్చిన సమయంలో వారికి

ముందుగా కోవిడ్ 19 క్లినికల్ స్క్రీనింగ్ చేస్తున్నామన్నారు. ఎటువంటి అనుమానం వచ్చినా నిర్ణయం కోసం ప్రభుత్వ ఆసుపత్రి లేదా ప్రభుత్వం గుర్తించిన జి ఎస్ ఎల్ వైద్య

కళాశాల ఆసుపత్రికి పంపుతున్నామన్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam