DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క్లిష్ట పరిస్థితుల్లో సైతం మార్గదర్శిగా నిలుస్తున్న జిల్లా. . శ్రీకాకుళం

*మహమ్మారి పై  à°•à°Ÿà±à°Ÿà±à°¦à°¿à°Ÿà±à°Ÿ పోరాటం లో ప్రతి ఒక్కరిదీ కీలక పాత్రే*

*మంత్రులు, అధికారుల సంపూర్ణ సహకారంతో నిరంతర శ్రమ* 

జ్యోతి ప్రజ్వలనతో సైతం పాల్గొని

దేశ ఐక్యతను చాటారు. . . 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 05, 2020 (డి ఎన్ ఎస్) : ప్రస్తుతం కొనసాగుతున్న అత్యంత విపత్కర

పరిస్థితుల్లో సైతం కఠోర దీక్షతో అన్ని జాగ్రత్తలనూ తీసుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తూ మార్గదర్శకంగా నిలుస్తోంది శ్రీకాకుళం జిల్లా. ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రానికి చిట్టచివరి జిల్లా గా, వెనుకబడినప్పడికి పోరాటం లో మాత్రం కఠోర శ్రమ చేస్తోంది. ఒక ప్రక్క అధికార యంత్రాంగాన్ని నడిపిస్తూ, మరోప్రక్క ప్రభుత్వ

పెద్దల ప్రణాళిక ను యధాతధంగా అమలు చెయ్యడం లో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డాక్టర్ జె. నివాస్ అందరి కీ ఆదర్శంగా నిలుస్తున్నారు. స్వతహాగా వైద్యులు కావడంతో కరోనా

మహమ్మారి ని అరికట్టేందుకు, జిల్లాలో అస్సలు ప్రవేశించకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని జాగ్రత్తలనూ కఠినంగా అమలు చేస్తున్నారు. మరో ప్రక్క జిల్లా లో లాక్ డౌన్

నియంత్రణలో జిల్లా ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి నేతృత్వంలోని పోలీసు బలగాలు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా వారిని హెచ్చరిస్తూ, ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యేలా

చర్యలు చేపట్టారు. 

ఒక ప్రక్క ప్రజలలో సంపూర్ణ అవగాహనా కల్పించి, వారిని చైతన్య పరుస్తూ, మరోప్రక్క, గృహ నిర్బంధం లో ఉన్నవారి కి తగిన వైద్య సహాయాన్ని

అందిస్తూ, క్రింది స్థాయి సిబ్బందికి పూర్తి మార్గదర్శకం చేస్తున్నారు. జిల్లా కు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ సైతం కలెక్టర్ నివాస్, ఎస్పీ ఆర్ ఎన్ అమ్మి

రెడ్డి à°²  à°•à±ƒà°·à°¿à°¨à°¿ మీడియా ముఖంగానే ప్రశంసించారంటే ఆయన విధి నిర్వహణ తెలుస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన జిల్లా అయినప్పడికే, ప్రజల్లో సంపూర్ణ చైతన్యం కల్గించి,

విద్యావంతులు, ఉపాధ్యాయ వర్గాలు, గ్రామా వాలంటీర్లు, ఆశ సిబ్బంది తదితర సిబ్బందిని ఉత్తేజ పరుస్తూ ప్రజల్లో చైతన్యం కల్గించే విధంగా ప్రణాలికను అమలు

చేస్తున్నారు. స్వీయ గృహ నిర్బంధం లో ఉన్న వారి ఆరోగ్య స్థితిని ఎప్పడికప్పుడు తెలుసుకుంటూ వారికి తగిన సూచనలు చేయించడం లో జాప్యం లేకుండా జాగ్రత్త

తీసుకుంటున్నారు. 

దేదీప్య మానంగా జ్యోతి ప్రజ్వలన. . .

కరోనా మహమ్మారి రాక్షసుని పై పోరాటానికి దేశ ప్రజలంతా ఐకమత్యం తో ఉన్నారు అనే సంకేతాన్ని

ఇచ్చేందుకు ఆదివారం నిర్వహించిన జ్యోతి ప్రజ్వలన లో సైతం జిల్లా ప్రజలు మొత్తం పాల్గొన్నారు. జిల్లా కు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసన సభాపతి తమ్మినేని సీతారాం,

మంత్రి ధర్మాన కృష్ణదాస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జె నివాస్, ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి,  à°œà°¾à°¯à°¿à°‚ట్ కలెక్టర్ à°¡à°¾.కె.శ్రీనివాసులు,  à°…రసవల్లి ఆలయ ప్రాంగణం లోనూ

అర్చకులు వేదపఠనం చేస్తూ ప్రమిదలను వెలిగించారు. 

నిరంతరం అధికారులతో పాటె శ్రమిస్తున్న పాత్రికేయ రంగ సిబ్బంది, సామాన్య ప్రజలు సైతం తమ ఇళ్ల నుంచే జ్యోతి

ప్రజ్వలన కార్యక్రమం లో పాల్గొన్నారు. తొమ్మిది నిమిషాల సమయంలో ప్రకృతి ని ప్రార్ధిస్తూ ప్రమిదలు, కొవ్వొత్తులు, మొబైల్ లో ఫ్లాష్ లైట్ లు తదితర అన్ని సాధనాలను

వినియోగించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam