DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాత్రికేయులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి : గంట్ల శ్రీనుబాబు

*సొంత నిధులతో ఐదు à°°à±‹à°œà±à°²à±à°—à°¾ పాత్రికేయులకు ఆహార సామాగ్రి పంపిణీ*

*పాత్రికేయ కుటుంబ పెద్దగా, ఇది నా కనీస భాద్యత, శ్రీనుబాబు* 

*తమిళనాడు లాగా ఏపీ లో

కూడా ఆర్ధిక ప్రోత్సాహం అందించాలి. :*

*పాత్రికేయులూ సమాజంలో భాగస్వాములేనని పార్టీలు గుర్తించాలి.*  

*ఆత్మీయులకు అండగా పాత్రికేయ సంఘం జాతీయ

కార్యదర్శి*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 07, 2020 (డిఎన్ఎస్) : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న ప్రస్తుత విపత్కర సమయంలో సైతం

అత్యంత రిస్క్ చేస్తూ కూడా విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులను ఆర్ధిక పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని జాతీయ పాత్రికేయ సంఘం కార్యదర్శి

గంట్ల శ్రీనుబాబు పిలుపునిచ్చారు. ఈయన ప్రస్తుతం విశాఖపట్నం నగర పాత్రికేయుల సంఘం ( వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్) అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. 

విశాఖ నగరం

లోని పాత్రికేయులకు అండగా నిలుస్తూ తన వంతు భాద్యతగా గత ఐదు రోజులుగా ఆయన సొంత నిధులతో కనీస ఆహార సామాగ్రిని వారికి అందిస్తున్నారు. ఈ సందర్బంగా ఫోటో జర్నలిస్ట్

లు, వీడియో గ్రాఫర్ లు, వెబ్ మీడియా ప్రతినిధులు, విలేకరులు, చిన్న పత్రికల ప్రతినిధులు, డెస్క్ జర్నలిస్ట్ లు, స్థానిక టీవీ ఛానెళ్ల న్యూస్ రీడర్లు, సాంకేతిక

సిబ్బంది ఇలా అన్ని తరహాల పాత్రికేయ సంస్థల సభ్యులను తన సొంత కుటుంబంగా భావించి à°…à°‚à°¡à°—à°¾ నిలిచారు.  à°†à°¯à°¨ తన సొంత నిధులతో కనీస ఆహార అవసరాలైన బియ్యం, కందిపప్పు, పంచదార,

ఆయిల్, చింతపండు తదితర సామాగ్రిని అందించారు. 

ఈ సందర్బంగా నగరం లోని ఆంధ్రప్రభ కార్యాలయంలో గత ఐదు రోజులుగా అత్యంత కట్టుదిట్టమైన తరహాలో, కనీస దూరం

పాటిస్తూ, అందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నారు. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాత్రికేయులందరూ తన కుటుంబ సభ్యులేనని, కుటుంబ పెద్ద గా కనీస భాద్యతను

నిర్వర్తిస్తున్నట్టు తెలిపారు. à°ªà°¾à°¤à±à°°à°¿à°•à±‡à°¯à±à°²à°‚దరూ తన కుటుంబ సభ్యులేనని, కుటుంబ పెద్దగా ఇది నా కనీస భాద్యత అని శ్రీనుబాబు ప్రకటించడం ఆయన హుందాతనాన్ని

తెలియచేసింది. 

తమ వంతు సాయం అందించాలన దృఢ  à°¸à°‚కల్పముతో సొంత నిధులతో 10 కేజీల బ్రాండెడ్ బియ్యం, à°’à°• కేజీ కందిపప్పు,  à°“à°• లీటరు ఆయిల్ ప్యాకెట్, à°’à°• కేజీ పంచదార

లను దశలవారీగా అందించడం  à°œà°°à±à°—ుతుందని సీనియర్ జర్నలిస్టు  à°—ంట్ల శ్రీనుబాబు తెలిపారు.

ఇప్పటికే  à°¸à±à°®à°¾à°°à± 400 మంది జర్నలిస్టులకు సామాగ్రిని అందించడం

జరిగిందన్నారు. సాధ్యమైనంత మంది పాత్రికేయులకు తన వంతు సహకారం అందిస్తానని ప్రకటించారు. 

తమిళనాడు తరహాలో .  .:

తమిళనాడు ప్రభుత్వం గుర్తింపు పొందిన

పాత్రికేయులకు నెలకు రూ. 3000 ఆర్ధిక 
ప్రోత్సాహకాన్ని అందిస్తోందని, అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లోని పాత్రికేయులకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

పెద్ద మనసు చేసుకుని ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించాలని కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల భీమా లో జర్నలిస్టులకు చేర్చాలని

కోరారు. 

పాత్రికేయులు కూడా సమాజంలో భాగమేనని పార్టీలు గుర్తించాలి :  

కేవలం ప్రెస్ మీట్ లను కవరేజ్ చెయ్యడానికి మాత్రమే పాత్రికేయులు ఉన్నారని

భావించే రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు కూడా సమాజం లో భాగమేనని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. 

నిత్యం పాత్రికేయుల తో మమేకమై

కార్యాచరణాలు చేపడుతున్న ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు ప్రస్తుత కరోనా మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో విశాఖ నగర పరిధిలోని పాత్రికేయులకు అండగా

నిలవాలని పిలుపునిచ్చారు. వారు ఏ కార్యక్రమం చేసిన ముందుగా ఉండి విస్తృత ప్రచారం కల్పించే మీడియా వారికి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు, నేతలు

ముందుకు వచ్చి ప్రోత్సాహాన్ని ఇవ్వవలసిన అవసరం ఉందన్నారు.  

ఇతర ప్రాంతాల్లోని ప్రజా ప్రతినిధులు తమ పరిధిలోని పాత్రికేయులకు అండగా నిలుస్తూ. . తమ

ఔదార్యాన్ని చాటుకుంటున్నారన్నారు. అయితే à°ˆ పరిస్థితి విశాఖ నగర పరిధిలోనూ కొనసాగవలసిన అవసరం ఉందన్నారు. 

పాత్రికేయులు అప్రమత్తంగా ఉండాలి: . . .. 

కరోనా

వైరస్ సమయంలో న్యూస్ కవరేజ్ లో తమ ప్రాణాలను సైతం పక్కనపెట్టి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు జాగ్రత్తలు పాటించాలని శ్రీను  à°¬à°¾à°¬à± జర్నలిస్టులకు

సూచించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam