DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జీయర్ ఆశ్రమం నుంచి వలస బృందాలకు నిరంతర ప్రసాద వితరణ 

*ఆదర్శవంతంగా నిలుస్తున్న ఆధ్యాత్మిక తరంగం చిన్న జీయర్*

*ఆకలితో ఎవరూ ఉండరాదనే నిరంతర అన్న ప్రసాద వితరణ* 

*సుమారు 700 మందికి రెండు పూటలా అన్న ప్రసాద

వితరణ* 

*కరోనా ప్రభావం తగ్గే వరకూ కొనసాగిస్తాం: చిన్న జీయర్ స్వామి.*

*జీయర్ స్వామిజి పిలుపు తో దేశ వ్యాప్తంగా సేవాకార్యక్రమాలు*

*(DNS రిపోర్ట్ :

సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 08, 2020 (డిఎన్ఎస్) : ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామి సమాజ శ్రేయస్సు లో భాగంగా తమ జీయర్ ఆశ్రమం పరిసర

గ్రామాల్లో నిలిచిపోయిన వలస శ్రమ జీవులకు నిరంతరం అన్న ప్రసాదాన్ని అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడం తో ఇతర ప్రాంతాల నుంచి హైద్రాబాద్

శివారు ప్రాంతమైన శంషాబాద్, ముచ్చింతల్ తదితర ప్రాంతాల్లో దినసరి పనుల కోసం వచ్చి ఇక్కడ చిక్కుకు పోవడం తో ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఉత్తర

ప్రదేశ్, బీహార్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 700 మంది పరిస్థితి ని తెలుసుకున్న ఆధ్యాత్మిక ఆచార్యులు చిన్న జీయర్ స్వామి, తమ జీవా ఆశ్రమం లోని ఆశ్రమవాసులు,

శిష్యులకు మార్గదర్శకం చేసి, ఈ విధంగా ఈ గ్రామాల్లో చిక్కుకు పోయిన వలస శ్రమ జీవులకు ఉదయం, సాయంత్రం అన్న ప్రసాదాన్ని మన ఆశ్రమం నుంచే ఎప్పడికప్పుడు తయారు చేసి

అందించాలని ఆదేశించారు. దీంతో ఆశ్రమ వాసులు, అందుబాటులో ఉన్న భక్తులు సంపూర్ణ శ్రద్ధతో సాత్విక ఆహారాన్ని తయారు చేసి, ప్యాకింగ్ చేసి, వాహనాల్లో తరలించి,

సమీపంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది సహకారం తో గ్రామా శివార్లలో నిలిచి పోయిన శ్రామికులు, శ్రామిక కుటుంబాలకు స్వయంగా అందించే ఏర్పాటు చేసారు. ఉదయం,

సాయంత్రం కూడా వీరందరికి ఆహారాన్ని అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసారు. 

ఏప్రిల్  1 à°¨ మొదలైన à°ˆ కార్యక్రమం కరోనా మహమ్మారి రాక్షసుని బారి నుంచి పూర్తి

రక్షణ కలిగే వరకూ కొనసాగుతుందని చిన్న జీయర్ స్వామి తెలియచేసారు. మానవులందరూ భగవంతుని స్వరూపాలేనని, ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్నారు. ఇదే సందేశాన్ని తమ శిష్య

బృందాలను స్వామిజి అందించారు. 

స్వామిజి పిలుపు మేరకు : . . . 

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ

వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తమ ప్రాంతాల్లోని పేదలు, ఆర్తులకు తక్షణం సేవలు అందించాలని జీయర్ స్వామి పిలుపు ఇచ్చారు. స్వామిజి పిలుపు మేరకు

తెలుగు రాష్ట్రాల్లోనే కాక, దేశ విదేశాల్లో సైతం స్వామిజి ఆశ్రమ అనుబంధ సంస్థ వికాసతరంగిణి బృందాలు తమ సమీపంలోని వారికి ఆహార పదార్ధాలు, మాస్క్ లు, డెటాల్

సబ్బులు, పళ్ళు, తదితర పదార్థాలను పంపిణీ చేస్తున్నారు. 

శ్రీకాకుళం జిల్లాలో పరిధిలో శ్రీకాకుళం నగరం, టెక్కలి, నందిగాం మండలాల్లో పెద్ద సంఖ్యలో మాస్క్ లు,

డెట్టాల్ సబ్బులు, పంపిణీ చేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam