DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*పేదలకు అండగా తూ గో జిల్లా న్యాయసేవాధికార సంస్థ . .* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , ఏప్రిల్ 08, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : నిరుపేదలను ఆదుకోవడంలో న్యాయసేవాధికార సంస్థ ఎప్పుడూ ముందుంటుందని

జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. కరోనా నేపధ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా పనులు లేక ఆకలితో బాధపడుతున్న 300 మంది నిరుపేదలకు

బుధవారం    à°œà°¿à°²à±à°²à°¾ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బియ్యం, పప్పులు, కూరగాయలు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం లోని న్యాయ సేవా సదన్ వద్ద జరిగిన à°ˆ కార్యక్రమానికి

న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పేదలకు నిత్యావసరాలు అందించారు. అలాగే క్వారీ ఏరియా, కొంతమూరు గ్రామాల్లో పేదలకు పంపిణీ

చేసేందుకు బయలుదేరిన నిత్యావసరాలతో కూడిన వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుందని, దీని

నుండి బయట పడేందుకు ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం తప్పక పాటించాలన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఈ లాక్ డౌన్లో ఉపాధి కోల్పోయిన పేదలకు

నిత్యావసరాలను అందిస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం క్వారీ ఏరియా, కొంతమూరు గ్రామాల్లో పేదలకు నిత్యావసరాలను

పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ వెంకట ప్రసాద్, న్యాయమూర్తి కిషోర్ కుమార్,డిఎల్ఎస్ఎ సెక్రటరీ కెవిఎల్ హిమబిందు, సూపరింటెండెంట్

రుంజల వెంకట నాగమణి, డిఎల్ఎస్ఎ ప్యానల్ న్యాయవాదులు వెన్నా కుమార స్వామి, ధర్నాలకోట వెంకటేశ్వరరావు, గొట్టిముక్కల అనంతరావు, జెవివి రమణ, పారా సంస్థ ఫాదర్

ఇగ్నేసియస్, పిఎల్వీలు మొగ్గ శ్రీను, వసంతరాయుడు, లక్కోజు ఓంకార్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam