DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజలు ఒక జిల్లా నుండి మరో జిల్లాకు వెళ్లరాదు : సి ఎస్ 

*మరి కొన్ని రోజులు సహకరించాలని ప్రజలకు సూచన*  

*కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాన కార్యదర్శి వెల్లడి*  

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో ,

శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 08, 2020 (డిఎన్ఎస్) : లాక్ డౌన్ సమయంలో ప్రజలు à°’à°• జిల్లా నుండి          à°®à°°à±‹ జిల్లాకు వెళ్లారాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

నీలం సాహ్ని స్పష్టం చేసారు. బుధవారం సాయంత్రం కరోనా నియంత్రణ చర్యలపై జిల్లా కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ

లాక్ డౌన్ లో ప్రజలు à°’à°• జిల్లా నుండి మరో జిల్లాకు వెళ్లరాదని చెప్పారు. జిల్లాల్లో  à°µà±à°¯à°µà°¸à°¾à°¯, మార్కెటింగ్ పనులు యధావిధిగా జరగాలని సూచించారు. కరోనా కంటైన్మెంట్

జోన్ లు, బఫర్ జోన్ లు చివరి కేసు వరకు కొనసాగాలని, జోన్ లలో ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాలు ఉండాలని సూచించారు. రాష్ట్రంలో 146 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని,

కంటైన్మెంట్ జోన్లలో డోర్ డెలివరీ ఉండాలని స్పష్టం చేసారు. సంస్థలు సామూహిక పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాయని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని

చెప్పారు. 

సామూహిక పంపిణీ అనుమతించరాదని, ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదని, భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 348

పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వైరస్ వ్యాప్తి జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి ప్రైమరీ కాంటాక్ట్ ను

క్వారంటీన్ లో పెట్టాలని, వైద్యుల భద్రత పై కూడా అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా కె. ఎస్.జవహర్ రెడ్డి

మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకునేటట్లు అవగాహన కల్పించాలని చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్లో (క్వారంటీన్ కేంద్రాలు) కనీసం 2 వేల గదులు

ఉండాలని, కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సదుపాయాలు ఉండాలని స్పష్టం చేసారు.

రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ అనేక చోట్ల ఆహారం పంపిణీలో అధిక సంఖ్యలో

ప్రజలు గుమిగూడుతున్నారని, గుమిగూడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ జె నివాస్ , సంయుక్త కలెక్టర్ డా. కె.

శ్రీనివాసులు, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, సీతంపేట సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రోజెక్ట్ అధికారి సిఎం.సాయికాంత్ వర్మ, సహాయ

కలెక్టర్ ఏ. భార్గవ తేజ, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం.చెంచయ్య, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటిండెంట్ డా కె.

కృష్ణ మూర్తి, డిసిహెచ్ఎస్ బి.సూర్యారావు,  à°œà°¿à°²à±à°²à°¾ గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఏ.కళ్యాణ చక్రవర్తి, రెవిన్యూ డివిజనల్ అధికారి à°Žà°‚.వి.రమణ,  à°œà°¿à°²à±à°²à°¾ పంచాయతీ

అధికారి వి.రవికుమార్, నగర పాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య, ప్రత్యేక అధికారి జి.శ్రీనివాసరావు, విపత్తుల విభాగం ఇంచార్జి డిఎం బి.నగేష్, వైద్య శాఖ అధికారి డా.

అప్పారావు, డా.రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam