DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజాదీక్ష కు దైవ అనుగ్రహం కూడా లభిస్తుంది: చిన్న జీయర్*

*లోక రక్షణ కోసం జీయర్ ఆశ్రమంలో నవరాత్రి వేడుకలు* 

*జీయర్ ఆశ్రమం లో నవరాత్రి వేడుకల పూర్ణాహుతి. .*

*కొనసాగుతున్న వలసవాదులు నిత్యాన్న ప్రసాద వితరణ*

 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 09, 2020 (డిఎన్ఎస్) : విశ్వ శాంతి కోసం ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామి సంకల్పించిన

వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా పూర్ణాహుతి కార్యక్రమం తో ముగిసాయి. గురువారం శంషాబాద్ జీయర్ ఆశ్రమం లో వసంత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని

ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమైన సాకేత శ్రీరామ చంద్రుని ఆరాధనలు గురువారం జరిగిన మహా పూర్ణాహుతి మహోత్సవం తో ముగిసాయి. అనంతరం చిన్న జీయర్ స్వామి శిష్యులు,

ఆశ్రమవాసులందరికి అవభృత తీర్ధం అనుగ్రహించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేసారు. ప్రస్తుతం ప్రపంచాన్ని విపత్కర పరిస్థితుల్లోకి

నెట్టేసిన కరోనా మహమ్మారి రాక్షసుని బారి నుంచి ఈ మానవాళిని రక్షించాలని మహా సంకల్పంతో గత నెల 24 నుంచి నిరంతరం దివ్య సాకేత ఆశ్రమం లో దీక్షగా వేడుకలు

నిర్వహిస్తున్నట్టు తెలియచేసారు. దేశ వ్యాప్తంగా ప్రజలు లాక్ డౌన్ లో ఉండి, ఇంటికే పరిమితమై ఎంతో కష్టతరమైన యుద్దాన్ని చేస్తున్నారని, వారి పోరాటానికి దైవ

అనుగ్రహం కూడా లభిస్తుందన్నారు. దీని కోసమే గత నెల 24 న సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించామని, అనంతరం ప్రతి రోజూ సుందరకాండ పారాయణ అత్యంత దీక్షగా

చేపట్టామన్నారు. ఆన్ లైన్ ద్వారా ప్రసారమైన à°ˆ కార్యక్రమాల్లో వేలాదిగా భక్తులు తమ ఇంటి నుంచే పాల్గొన్నారన్నారు. 

ప్రజా సంకల్పానికి దైవ అనుగ్రహం

లభిస్తుందని, అతి త్వరలోనే à°ˆ విపత్కర పరిస్థితులపై మానవాళి అపూర్వ విజయం సాధించి, సాధారణ ప్రజా జీవనం లభిస్తుందని మంగళాశాసనం చేసారు. 

కొనసాగుతున్న

నిత్యాన్న ప్రసాద వితరణ: . . .

లాక్ డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస శ్రామికులు శంషాబాద్ ఆశ్రమ పరిసరాల్లో నిరాశ్రయులుగా మిగిలి పోవడం గమనించిన,

చిన్న జీయర్ స్వామి వారందరికీ ప్రతి రోజూ అత్యంత శ్రేష్టమైన సాత్విక ఆహారాన్ని అందిస్తున్నారు. సుమారు 700 మందికి పైగా వలస వాదులు ఉత్తర ప్రదేశ్, బీహార్ తదితర

ప్రాంతాల నుంచి దినసరి పనుల కోసం వచ్చిన ఈ ప్రాంతంలో చిక్కుకుపోయారు. దీంతో వారికి తిరిగి వెళ్లే అవకాశం లేకపోవడం తో ఆశ్రమం నుంచి రెండుపూటలా అన్న ప్రసాదాన్ని

స్థానిక పోలీసు బృందం సహకారం తో అందిస్తున్నారు. కరోనా ప్రభావం తొలగి యధాస్థితికి వచ్చే వరకూ అన్న ప్రసాద వితరణ సాగుతుందని స్వామిజి తెలియచేస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam