DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విధి నిర్వహణలో స్ఫూర్తి దాతలు పోలీస్, పారిశుధ్య కార్మికులే. . . 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 09, 2020 (డి ఎన్ ఎస్) : కరోనా వ్యాధికి పూర్తిగా అడ్డుకట్ట వేయాలని దేశ వ్యాప్తంగా అత్యంత

ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులు స్ఫూర్తిదాతలని సర్వత్రా కొనియాడుతున్నారు. లక్షలాది మంది వైద్యులు, వైద్య సహాయకులు, రక్షణ

సిబ్బంది, పారిశుధ్య కార్మికులు ఇలా ఎందరో ఉన్నారు. వారిలో కరోనా బాధితులు నివాసం ఉంటున్న ప్రదేశాల్లో ప్రత్యక్షంగా విధులు నిర్వహించేది వీరే. ఇలాంటి వారికి తమ

వంతు భాద్యత à°—à°¾ రాజ్యసభ సభ్యుడు వి. విజయ సాయి రెడ్డి, తమ స్వచ్చంద సంస్థ ప్రగతి ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సామాగ్రిని, రక్షణ సామాగ్రిని అందిస్తున్నారు.  
/> గురువారం  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ లోని బాపూజీ కళామందిర్ లో నిర్వహించిన కార్యక్రమం లో పారిశుద్ధ్య కార్మికులు, హోమ్ గార్డులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం

జరిగింది. 
à°ˆ కార్యక్రమానికి సభాపతి తమ్మినేని సీతారాం,  à°°à°¾à°·à±à°Ÿà±à°° మంత్రి ధర్మాన కృష్ణదాస్, శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు. 
à°ˆ

సందర్బంగా అతిధులు మాట్లాడుతూ  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ యంత్రాంగం బాగా పనిచేస్తోందని, అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారని చెప్పారు. ఇటువంటి సమయంలో మానవత్వం

పరిమళించాలని చెప్పారు. జిల్లా యంత్రాంగం మానవతావాదంతో పనిచేస్తున్నారని, వాలంటీర్లు కూడా బాగా పనిచేస్తున్నారని, వాలంటీర్లు వ్యవస్థను నడిపిస్తున్నారని

కితాబిచ్చారు. కరోనాను పూర్తిగా నివారించగలమనే నమ్మకాన్ని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కల్పించారని అన్నారు. 

శ్రీకాకుళం జిల్లాకు శ్రీ సూర్యనారాయణ

స్వామి ఆశీస్సులు ఉన్నాయని, అందువలనే ఇప్పటి వరకు ఒక కేసు కూడా రాలేదని స్పష్టం చేసారు. అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థలతో జిల్లాలో సమావేశం

నిర్వహించాలని, ప్రతీ ఒక్కరూ కరోనాపై పోరాటం చేసి, దానిని నివారిద్దామని అదికారులకు సూచించారు. కరోనా నివారణకు దాతృత్వం కావాలని రతన్ టాటా చెప్పారని, దేశం నాకు

సంపద ఇచ్చినందున, కావున దేశం కోసం సంపదను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనే భావనతో దాతలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రగతి భారత్ ఫౌండేషన్ వితరణ

గురించి శాసనసభాపతి à°ˆ సందర్భంగా  à°…భినందించారు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ మాట్లాడుతూ కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని

చెప్పారు. కరోనా నివారణకు రాష్ట్రంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం జరిగిందని, ఇందులో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.  à°…దేవిధంగా à°ˆ సమయంలో

అందరినీ ఆదుకుందామని చెప్పారు.

              à°ˆ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అర్. ఎన్. అమ్మిరెడ్డి, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్

పాలవలస విక్రాంత్, జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ ఛైర్మన్ పిరియా సాయిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam