DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విపత్కర తరుణమిది . . లాక్ డౌన్ తరవాతే రాజకీయాలు  

*రూ.వెయ్యి వైసీపీ అభ్యర్థులతో పంపిణీ పై ఈసీ à°•à°¿ ఫిర్యాదు* 

*పేదలకు à°…à°‚à°¡à°—à°¾ ఉందాం - ప్రధాని మాటకు కట్టుబడి ఉందాం* 

*పార్టీ సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ లో

జనసేనాని పవన్*  

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 09, 2020 (డిఎన్ఎస్) : కరోనా మహమ్మారి ప్రభావంతో దేశం మొత్తం విపత్కర

పరిస్థితుల్లో ఉందని, లాక్ డౌన్ తర్వాతే రాజకీయాలు మాట్లాడదామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులపై గురువారం పార్టీ రాజకీయ

వ్యవహారాల కమిటీ, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ విస్తృతి, లాక్ డౌన్ పరిణామాలపై చర్చించారు.
/> రాక్షసుణ్ణి అరికట్టడానికి లాక్ డౌన్ విధించడంతో పాటు సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి అయిందని, ఈ విపత్తులో పేద వర్గాలుపడుతున్న ఇబ్బందులను

తీర్చేందుకు మన పార్టీపరంగా à°…à°‚à°¡à°—à°¾ నిలుద్దాం అన్నారు. 

లాక్ డౌన్ పొడిగింపు, అప్పుడు అనుసరించే విధానాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  à°¤à±à°µà°°à°²à±‹ à°’à°• ప్రకటన

చేసే అవకాశం ఉందన్నారు. దాని ప్రకారం పేదలకు మనం ఏ విధంగా సహాయం చేయాలనే అంశంపై ఒక ప్రణాళిక అనుసరిద్దాం అన్నారు. ప్రధాన మంత్రి సూచనలను బాధ్యతాయుతంగా

పాటించాల్సిన అవసరం అందరిపైనా ఉందని తెలిపారు. 

ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరగడం, రోజువారీ కూలీలు,

చిన్నపాటి వృత్తుల్లో ఉన్నవారు, పేద వర్గాలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను, రైతుల సమస్యలను తెలియచేశారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి జనసేన కార్యకర్తలు చేస్తున్న

సేవాకార్యక్రమాలను పార్టీ అధ్యక్షులకు తెలిపారు. చేతి వృత్తులవారు, ఆటో డ్రైవర్లు, హాకర్లు ఉపాధికి దూరమై ఆర్థికపరమైన ఇబ్బందులుపడుతున్నారని

చెప్పారు.

కరోనా వైరస్ విస్తృతి ఉన్న విపత్కర తరుణం ఇది. ఈ సమయంలో రాజకీయాలు, ప్రభుత్వంపై విమర్శలు చేయడం మన ఉద్దేశం కాదన్నారు. సంయమనం పాటిస్తూ ఇబ్బందుల్లో

ఉన్న ప్రజలకు అధికారులనుంచి తగిన సహాయం, సేవలు అందేలా చూడాలన్నారు. లాక్ డౌన్ తరవాతే రాజకీయాలు, పాలనలోని వైఫల్యాల గురించి మాట్లాడదాం అని సూచించారు. 

పేద

కుటుంబాలకు  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ అందిస్తున్న రూ.వెయ్యి పంపిణీ చేసిన తీరు, స్థానిక ఎన్నికల్లో వైసీపీ తరఫున నిలబడ్డ అభ్యర్థుల ద్వారా పంపిణీ చేయించడంపై  à°ªà±€à°à°¸à±€ సభ్యులు,

నాయకులు నా దృష్టికి తీసుకువచ్చారు. నాయకులు తమ పరిధిలో చోటుచేసుకున్న ఈ తరహా పంపిణీలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయలని

తెలిపారు. 

ప్రణాళికాబద్ధంగా, సోషల్ డిస్టెన్సింగ్, ఇతర నిబంధనలు పాటిస్తూ సేవాకార్యక్రమాల్లో పాల్గొందాం. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో నాయకులు,

జనసైనికులు ఆహారం, కూరగాయలు, నిత్యావసరాలు అందిస్తూ తమ వంతు సామాజిక బాధ్యత నిర్వర్తిస్తున్నారు అన్నారు. 


•    à°­à°°à±‹à°¸à°¾ ఇవ్వాలి: శ్రీ నాదెండ్ల మనోహర్ గారు 
/> గారు మాట్లాడుతూ “కరోనా వైరస్ వ్యాప్తి à°’à°• ప్రాంతానికో, రాష్ట్రానికో కాదు అంతర్జాతీయంగా ఉత్పన్నమైన విపత్తు ఇది. à°ˆ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నాన్ సీరియస్ à°—à°¾

వ్యవహరిస్తోంది. ప్రజలకు అవసరమైన భరోసా కల్పించలేకపోతోంది. మంత్రులు కూడా తగిన జాగ్రత్తలు పాటించకుండా పర్యటనలు చేస్తున్నారు. రైతుల సమస్యలు మన దృష్టికి

వచ్చాయి. గౌరవనీయ ప్రధానమంత్రి గారు పేద కుటుంబాలకు అండగా ఉండాలి, కనీసం ఒక పేద కుటుంబానికి సాయం చేయండి అని చెప్పారు. మన పార్టీ నాయకులు పలు చోట్ల కూరగాయలు

ఇస్తున్నారు. అలాగే విధుల్లో ఉన్న సిబ్బందికీ, పేదలకు ఆహారం అందిస్తున్నారు. లాక్ డౌన్ మరికొన్ని రోజులు పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో మనం ఎలా

అండగా ఉండాలి అనే విషయంపై ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి అని పార్టీ అధ్యక్షులు స్పష్టం చెప్పారు. వారు చేసే సూచనలకు అనుగుణంగా నిబంధనలు అనుసరిస్తూ సేవా

కార్యక్రమాలు చేపట్టాలి” అన్నారు. 

à°ˆ సమావేశంలో పి.ఏ.సి. ఛైర్మన్  à°¨à°¾à°¦à±†à°‚డ్ల మనోహర్,  à°ªà°¿.ఏ.సి. సభ్యులు కె.నాగబాబు, ప్రధాన కార్యదర్శులు తోట చంద్రశేఖర్, à°Ÿà°¿. శివ

శంకర్, బొలిశెట్టి సత్య, ఇతర కమిటీ ప్రతినిధులు మధుసూదన్ రెడ్డి, డా. హరిప్రసాద్, బి.నాయకర్, పి.యశస్విని తదితరులు కాన్ఫరెన్స్ లో ప్రస్తావించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam