DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైతు బజార్లలో కరోనా క్రిమిసంహారక ద్వారాలు ప్రారంభం 

*పరిశీలించిన సంయుక్త కలెక్టర్ ఎల్ శివ శంకర్*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 11, 2020 (డిఎన్ఎస్) :  à°°à±ˆà°¤à± బజార్ లకు వచ్చే ప్రజలకు

కరోనా వైరస్ నుండి రక్షించేందుకు రైతు బజార్ వద్ద కరోనా క్రిమిసంహారక ద్వారాలు (కరోనా డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్) లను ఏర్పాటు చేస్తున్నట్లు సంయుక్త కలెక్టర్

లోతేటి శివశంకర్ తెలిపారు. శనివారం ఆయన బుల్లయ్య కళాశాల రైతు బజార్లో ఏర్పాటుచేసిన అయితే 'జల్లు ద్వారాన్ని' ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

జనసమ్మర్థం ఉన్న చోట్ల కరోనా వ్యాధి వ్యాపించే అవకాశం ఉన్నందున ఇటువంటి కరోనా క్రిమిసంహారక జల్లు ద్వారాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ద్వారం లోనికి

కొనుగోలుదారుడు ప్రవేశించిన వెంటనే సెన్సార్ల ద్వారా గమనించి వారిపై పది సెకండ్ల పాటు పైనుండి క్రింది వరకు సోడియం హైపో క్లోరైడ్  à°…నే ఔషధం పన్నీరు లా వెదజల్ల

బడుతుందన్నారు. దీనివలన మనిషి తల నుండి కాళ్ళ వరకు  à°µà±†à°¦à°œà°²à±à°²à°¬à°¡à°¿   ఎక్కడైనా కరోనా క్రిమి ఉన్నట్లయితే నాశనం చేస్తుందని అంతే కాకుండా మరో à°…à°°à°—à°‚à°Ÿ కాలం కరోనా

 à°¸à±‹à°•à°•à±à°‚à°¡à°¾ రక్షణ ఇస్తుందని వివరించారు. నగరంలో ఆరు రైతు బజార్ల వద్ద à°ˆ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బుల్లయ్య కళాశాల వద్ద హీరో శానిటైజర్ వారు, ఎంవిపి కాలనీ

జ్ఞానాపురం పెదగంట్యాడ వుడా కాలనీ రైతు బజార్ల వద్ద విధాత ఫౌండేషన్ వారు, పాత పోస్ట్ ఆఫీస్ వద్ద గల ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద జీనత్ ఇంజనీర్స్ సౌజన్యంతో

ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam