DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజల రక్షణకే లాక్ డౌన్ కొనసాగింపా? అవుననే సంకేతాలు. . . 

*14 న ప్రధాని ప్రసంగం లో వివరిస్తారని బీజేపీ వర్గాల వెల్లడి . . .*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి, ఏప్రిల్ 13, 2020 (డి ఎన్ ఎస్): గడచిన

మూడు వారాలుగా అమలవుతున్న దేశవ్యాప్త లాక్ డౌన్ ను ప్రజల రక్షణ కోసమే మరింకొంత కాలం పొడిగించేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రజల ప్రాణాలను

కాపాడుకోవడంతో పాటు, ప్రజా జీవనంతో పాటు ఆర్థిక వృద్ధిని కొనసాగించడమే లక్ష్యంగా రెండో విడత లాక్ డౌన్ ఉంటుందని కేంద్ర వర్గాల నుంచి సంకేతాలు వస్తున్నట్టు

తెలియవచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం దేశ ప్రధాని జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం లో తెలియనుంది. దీని ప్రకారం కనీసం మరో 15 రోజుల పాటు లాక్

డౌన్ ను పొడిగిస్తారని తెలుస్తోంది. అయితే నిబంధనల్లో కొన్నింటిని సడలిస్తుందని సమాచారం. కనీసం 15 రకాల పరిశ్రమలు, వీధి వ్యాపారులు తమ వ్యాపారం కొనసాగించేందుకు

అనుమతి ఇచ్చే అవకాశాలు ఉండవచ్చన్నది సమాచారం. ఇప్పడికే దేశ వ్యాప్తంగా వ్యాపార వ్యవస్థ, తద్వారా ఆర్ధిక వ్యవస్థ నిలిచిపోయిన నేపథ్యంలో వారు తిరిగి కోలుకునే

అవకాశం లభించవచ్చు. 

లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలుగగా, దాన్ని తిరిగి గాడిలోకి పెట్టడం ద్వారా, ప్రజా జీవనానికి ఆటంకం లేకుండా

చూడాలని మోదీ భావిస్తున్నట్టు ఢిల్లీ లోని బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.  

పలు రకాల పరిశ్రమలు ఒకే షిఫ్ట్ విధానంలో పని చేసుకునేందుకు అనుమతించాలని

ఇప్పటికే కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. వీటిల్లో ఎలక్ట్రికల్, టెలికం, కంప్రెషర్, కండెన్సర్ యూనిట్లతో పాటు, స్టీల్, లోహ ఉత్పత్తుల మిల్స్,

స్పిన్నింగ్ మిల్స్, పవర్ లూమ్స్, రక్షణ రంగ పరికరాలు తదితరులు ఉన్నాయి. ప్యాకేజ్డ్ ఫుడ్ ఇండస్ట్రీకి కూడా పరిమితులతో కూడిన అనుమతులు లభించవచ్చు. ప్లాస్టిక్

మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు, ఆటోమోటివ్, జెమ్స్ అండ్ జ్యూయెలరీ యూనిట్లతో పాటు సెజ్ కార్యకలాపాలు, ఎగుమతి ఆధారిత యూనిట్లకు కూడా సడలింపులు ఇస్తారని

తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉన్నతాధికారులు తమ విధులకు హాజరవుతారని, జాయింట్ సెక్రటరీలు, ఆపై స్థాయి అధికారులు, తమతమ కార్యాలయాల్లో మంగళవారం

నాడు రిపోర్ట్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు వెలువడ్డాయి. 

ఇక, జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలకు అనుమతిస్తూ, కేంద్ర హోమ్ శాఖ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ

ఆదివారం నాడు ఆదేశాలు జారీ చేసింది. వివిధ రాష్ట్రాలను దాటి వెళ్లే రవాణా వాహనాలు, ట్రక్ లు, కోల్డ్ స్టోరేజీలకు పంటను తీసుకెళ్లే వాహనాలు, వేర్ హౌస్ ల నుంచి వివిధ

ప్రాంతాలకు వెళ్లే వాహనాల రాకపోకలకు అడ్డంకులు లేకుండా చూసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam