DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కాంతిలాల్ దండే

*క్వారంటైన్ కేంద్రాల్లో ఏర్పాట్ల పరిశీలన లో అధికారులు* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , ఏప్రిల్ 13, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : కరోనా

వ్యాధి వలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే తెలిపారు. సోమవారం 
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి. మురళీధర్

రెడ్డి తో కలసి రాజమహేంద్రవరం శివారు గ్రామమైన బొమ్మూరు లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించారు. కరోనా వ్యాధి వచ్చిన బాధితులను అక్కడ

ట్రీట్మెంట్ చేయించేందుకు ఏర్పాట్లును పరిశీలించారు. 
బొమ్మూరులో ప్రభుత్వం నిర్మించిన గృహ సముఉదాయంలో ఏర్పాట్లును పరిశీలించారు. ఈ సందర్భంగా కాంతిలాల్

దండే మాట్లాడుతూ  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ కరోనా వ్యాధి ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తిచేశారు. వ్యాధి సోకినట్లు

అనుమానితులు ఉన్న యెడల ఆయా సెంటర్లకు వచ్చి పరీక్షలు చెయించుకోవచ్చునని తెలిపారు. ఎవరు భయపడవలసిన పనిలేదని అన్నారు. డాక్టర్లు ఇతర వైద్య సిబ్బంది పూర్తి

స్థాయిలో పనిచేస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ కత్తిపూడి లో వచ్చిన ఆప్రాంతంలో

చాలామందికి కరోనా వ్యాధి పరీక్షలు నిర్వహించటం జరిగిందని చాలమందికి నెగిటివ్ వచ్చిందని అన్నారు. లాక్ డౌన్ వలన అక్కడ వ్యాధి ప్రబలకుండా చేయగలిగామని అన్నారు.

ప్రజలు కూడా సహకరించాలని అన్నారు. ఏదైన అనుమానంగా ఉన్న యెడల క్వారంటైన్ కేంద్రాలకు వచ్చి ఉచ్ఛితంగా పరీక్షలు నిర్వహించుకోవచ్చునని ఒక వేళ నెగటివ్ వచ్చినయెడల

వెంటనే వెళ్లిపోవచ్చునని పోజటివ్ వస్తే చికిత్స చెయంచుకోవచ్చునని అన్నారు. వ్యసాయం, ఉద్యానవనం, ఆక్వా రంగాలు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని

ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సెంటర్ ను పరిశీలించారు. డాక్టర్లు తో మాట్లాడి తీసుకోవలసిన జాగ్రత్తలు పై మాట్లాడారు.కార్యక్రమంలో రాజమహేంద్రవరం మునిసిపల్ కమిషనర్

అభిశక్తి కిషోర్, ఐ.à°Ÿà°¿.à°¡à°¿.ఏ  à°ªà°¿.à°“  à°¨à°¿à°¶à°¾à°‚à°¤ కుమార్, రాజమహేంద్రవరం సబ్-కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, రంపచోడవరం సబ్-కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, విద్యుత్

ఏ.డి.ఇ-ఎన్.శామ్యూల్, ఏ.ఎస్.ఓ - పి.బీమశంకర్, వైద్య శాఖ అధికారి డాక్టర్ రమేష్ కిశోరె, పోలీస్ అధికారి ఎస్.రామకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ బాపిరాజు తదితరులు ఉన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam