DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిషేధంలో అక్రమ మద్యం తరలిస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు

*రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మద్యం షాపును తనిఖీ చేస్తాం:

మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్  à°µà°¿ లక్ష్మణ రెడ్డి*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్,

అమరావతి :). . .*

అమరావతి  , ఏప్రిల్ 13, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :  à°°à°¾à°·à±à°Ÿà±à°° వ్యాప్తంగా à°¡à°¿ సి లు,  à° సి లు, డిపో మేనేజర్లతో నిర్వహించబడిన వీడియో కాన్ఫెరెన్స్ లో అత్యున్నత కమిటీ పలు

కీలక నిర్ణయాలను సూచినట్టు మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి తెలిపారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన

మాట్లాడుతూ à°ˆ నెల 11 à°¨ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ఇంచార్జి లతో ఉన్నత కమిటీ నిర్వహించిన సమావేశం వివరాలను తెలిపారు. 

ఈ వీడియో సమావేశంలో

ఉపముఖ్యమంత్రి, ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మరియు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు,  à°•à±†. నారాయణ స్వామి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ (FAC)

 à°ªà±€à°¯à±‚ష్ కుమార్, ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్,  à°•à°®à°¿à°·à°¨à°°à± ఆఫ్ డిస్టిలేరీస్ అండ్ బ్రేవరీస్ - మేనేజింగ్ డైరెక్టర్ à°¡à°¿.వాసుదేవ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్

( ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్) వినీత్ బ్రిజ్ లాల్ తదితరులు పాల్గొన్నారు. 

à°† సమావేశం లో తీసుకున్న నిర్ణయాలు : 

మార్చి  22 నుండి సీలు వేసి మూసివేసిన 3500

ప్రభుత్వ మద్యం షాపులను, 800లకు పైగా వున్న బార్ మరియు రెస్టారెంట్ లను తనిఖీలు చేసి అక్రమంగా మద్యం తరలించి వుoటే సంబంధిత సూపర్ వైజర్, సేల్స్ మెన్ లతో పాటు బార్

యజమానులు,  à°¸à°‚బంధిత అధికారులపై సత్వర చర్యలు తీసుకుంటారు.  

మార్చి 22న సీలు వేసిన సమయానికి వున్న మద్యం నిల్వలు తనిఖీలు చేసిన సందర్భంగా వున్న మద్యం నిల్వలలో

ఏమాత్రం తేడా వచ్చినా కఠినంగా శిక్షిస్తాం.à°ˆ  à°¤à°¨à°¿à°–ీల నిర్వహణ కోసం ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్,  à°ªà±‹à°²à±€à°¸à±,  à°®à°¦à±à°¯à°‚ డిపోల సిబ్బందితో కూడిన టాస్క్ఫోర్స్ బృందాలు

ఏర్పాటు చేసారు. కొంతమంది స్వార్థపరులు అక్కడక్కడా మద్యం షాపులు,  à°¬à°¾à°°à± మరియు రెస్టారెంట్ à°²  à°¨à±à°‚à°¡à°¿ అక్రమంగా మద్యం తరలించినట్లు మా  à°¦à±ƒà°·à±à°Ÿà°¿à°•à°¿ వచ్చింది. ప్రజా

ప్రతినిధులు ఎవ్వరూ అక్రమ మద్యం కార్యకలాపాలను ప్రోత్సహించ వద్దని 
సూచించారు.  

ఏ స్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధి అయినా  à°…క్రమ మద్యాన్ని ప్రోత్సహిస్తే

ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్తామని తెలిపింది. ముఖ్యమంత్రి దృఢసంకల్పమైన  à°¦à°¶à°²à°µà°¾à°°à±€ మద్య నిషేధానికి ఎవ్వరూ తూట్లు పొడవాలని

చూసినా సహించేది లేదు. రాజకీయ జోక్యం ఏ మాత్రం ఉండరాదని కోరుతున్నారు. 

లాక్ డౌన్ ప్రకటించిన మార్చి 22 నుండి ఏప్రిల్ 12 వరకు ఆంధ్రప్రదేశ్ లో ని 13 జిల్లాలలో 2178

అక్రమ మద్యం కేసులు నమోదు కాగా 22 13 మందిని అరెస్టు చేయడమైనది. 16405 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయడం జరిగింది. 3, 61, 500 లీటర్ల   పులిసిన బెల్లం ఊటను ధ్వంసం

చేశారు. 

మన రాష్ట్రానికి సంబంధించిన 1976 లీటర్ల మద్యం ను,  1500 లీటర్ల బీర్ బాటిల్స్ à°²  à°¨à± స్వాధీనం చేసుకున్నారు.

ఇతర రాష్ట్రాల నుండి తరలిస్తున్న 1420 లీటర్ల

మద్యంను స్వాధీనం చేసుకున్నారు. 3000 లీటర్ల కల్లును పట్టుకున్నారు. అక్రమ మద్యాన్ని రవాణా చేస్తున్న 464 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. లాక్ డౌన్ లో సహితం కృషి చేసి

అక్రమార్కులను పట్టుకున్న ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్  à°¸à°¿à°¬à±à°¬à°‚దిని అభినందిస్తున్నారు.  

తెలంగాణ రాష్ట్రంలో కల్తీ కల్లు అత్యధికంగా వినియోగించడం వలన

ప్రస్తుతం విత్ డ్రాయల్ లక్షణాలు ఎక్కువగా వచ్చి  à°µà°‚దలాదిమంది ఆస్పత్రుల పాలౌతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కల్తీకల్లు లేనందున à°† పరిస్థితి లేదని

తెలిపింది.

ఎవరికైనా వ్యసనపరులకు విత్ డ్రాయల్ లక్షణాలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న డీ-అడిక్షన్ కేంద్రాలను సంప్రదించగలరు.

గుంటూరులోని న్యూ లైఫ్ à°¡à°¿- అడిక్షన్ కేంద్రం వారు ఉచితంగా వైద్యాన్ని అందిస్తారు. 9849347500 నెంబరును  à°¸à°‚ప్రదించవచ్చన్నారు. 

అక్రమ మద్యానికి  à°¸à°‚బంధించి

 à°«à°¿à°°à±à°¯à°¾à°¦à±à°²à°¨à±14500 మరియు 18004254868 టోల్ ఫ్రీ నెంబర్లకు ఇవ్వగలరు. మీడియా సమావేశంలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాస్, ఎక్సైజ్

సూపరిండెంట్స్ ఎన్.బాలకృష్ణన్, ఎస్. రవికుమార్, సి. హెచ్. వి మహేష్ కుమార్ లతో పాటు ఎపిబ్రివరేజ్ కార్పొరేషన్స్ డిపో మేనేజర్లు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam