DNS Media | Latest News, Breaking News And Update In Telugu

26 న సింహాచలం చందనోత్సవం కూడా ఏకాంతంలోనే . .

*à°ˆ నెల 26 à°¨ రాత్రి ఘటాభిషేకం చేసేది అర్చకులు మాత్రమే* 

*కరోనా కట్టడితో భక్తులకు నో , మీడియా కూ నో.: ఈఓ వెల్లడి.* 

*దేవాలయ చరిత్రలో మొట్ట మొదటి సారి

ఏకాంతంలో ఉత్సవాలు* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 14, 2020 (డిఎన్ఎస్) : లక్షలాది మంది భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా

నిర్వహించే శ్రీ వరాహ లక్ష్మి సృశింహ స్వామి నిజరూప దర్శనం ( చందన యాత్ర  ) à°ˆ సంవత్సరం కేవలం 30 మంది వైదిక బృందం సమక్షంలోనే జరుగనుంది. à°ˆ ఉత్సవం ఈనెల 26 à°µ తేదీన వైభవంగా

జరగవలసి ఉంది. 

ప్రతి ఏడాదీ అత్యంత వైభవంగా నిర్వహించే సింహాచల క్షేత్రంలో వెలసిన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి నిజ రూప దర్శనం ఈ ఏడాది కేవలం ఏకాంతం లోనే

నిర్వహిస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం. వెంకటేశ్వర రావు తెలియచేసారు. మంగళవారం విడుదల చేసిన వీడియో ప్రకటన లో ఆయన వివరాలను వివరించారు. ఈ సందర్బంగా ఆయన

మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రాక్షసుడు ఇబ్బంది పెడుతున్న సందర్బంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న లాక్ డౌన్ ను మే నెల 3 వరకూ పొడిగిస్తున్నట్టు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళ వారం ప్రకటించడంతో సింహాచల క్షేత్ర ఆలయంలో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. 

ఏకాంతంలోనే చందన

యాత్ర. . . :

ప్రతి ఏడాది ముందు రోజు అర్ధరాత్రి స్వామి పై ఉన్న 500 కిలోల చందనాన్ని తొలగించి, స్వామి నిజ రూపాన్ని భక్తులకు అనుగ్రహించడం జరుగుతుంది. స్వామి

నిజరూపదర్శనాన్ని మొదటగా ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తలు దర్శించుకున్న తర్వాతే. . .మిగిలిన ప్రముఖులు, భక్తులకు స్వామి దర్శనం లభిస్తుంది. అయితే ఈ పర్యాయం కేవలం

ధర్మకర్తల దర్శనం మాత్రమే లభించేందుకు అవకాశం ఉంది. 

సహస్ర ఘటాభిషేకం కూడా అర్చకులే. . .

రోజంతా సామాన్య భక్తులకు స్వామి దర్శనం చేయించిన తర్వాత రాత్రి

సుమారు 500 మంది శ్రీవైష్ణవ స్వాములు గంగ ధార నుంచి తీసుకు వచ్చిన పవిత్ర జలంతో స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఈ సేవలో పాల్గొనేందుకు దేశంలోని

వివిధ రాష్ట్రాల నుంచి శ్రీవైష్ణవ స్వాములు పెద్ద సంఖ్యలో సింహాచలం రావడం జరుగుతుంది. 

అయితే కరోనా కట్టడికి ఈ ఏడాది ఈ సహస్ర ఘటాభిషేకం కూడా కేవలం ఆలయంలో

విధులు నిర్వహించే అర్చక, శ్రీవైష్ణవ  à°µà±ˆà°¦à°¿à°• బృంద సభ్యులు మాత్రమే చెయ్యడం జరుగుతుందని ఈఓ తెలియచేసారు. 

మీడియా కు కూడా నో ఎంట్రీ : . .. 

ఆలయం లో జరిగే

కార్యక్రమాలను కవరేజ్ ఇచ్చేందుకు మీడియా వర్గాలను గత కొన్ని రోజులు వరకూ అనుమతించారు. కరోనా ప్రభావం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉండడంతో, మీడియా వారికి సైతం

ప్రవేశాన్ని నిలిపి వేస్తున్నట్టు ఈఓ తెలిపారు. వారి ఆరోగ్య రక్షణ కూడా తమకు ముఖ్యమని, పైగా ప్రస్తుతం భక్తులు ఎవ్వరూ లేనందున కొండా ప్రాంతాల్లో పూర్తిగా

నిర్మానుష్యంగా ఉందన్నారు. ఈ సమయంలో ఒంటరిగా వీరు వెళ్లడం కొంచెం ఇబ్బంది కరం కావచ్చన్నారు. అందువల్ల మీడియా వారిని సైతం అనుమతించడం లేదని, ఆలయంలో జరిగే

కార్యక్రమాలను యు ట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రసారం చేస్తున్నామని, మీడియా వారు సహకరించాల్సిందిగా కోరుతున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam