DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆహార, వస్తు, సామాగ్రి పంపిణీ కి పొలిసు అనుమతి తప్పని సరి 

*సేవా సంస్థలకు జిల్లా ఎస్పీ అట్టాడ బాపూజీ సూచన*  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .

విశాఖపట్నం, ఏప్రిల్ 14, 2020 (డిఎన్ఎస్) : కరోనా కట్టడిలో పేదలకు,

ఆర్తులకు ఆహార, వస్తు, సామాగ్రిని పంపిణీ చేసేందుకు స్థానిక పోలీస్ సిబ్బంది, ఇతర అధికారుల అనుమతులు తప్పని సరి అని విశాఖ జిల్లా ఎస్పీ అట్టాడ బాపూజీ ఓ ప్రకటనలో

తెలిపారు. దాతలు, ఉచితంగా వస్తువులు పంపిణీ చెయ్యడానికి ఎక్కడ, ఎవరికీ అవసరం ఉందొ ప్రభుత్వ అధికారులు, పొలిసు సిబ్బంది తెలియచేస్తారని, ఒక సమయం కేటాయించి, వీరికి

తగిన దిశా నిర్దేశం చేస్తారన్నారు. ఇంతవరకూ గుంపు గా వెళ్లడం వలన, కొంత తోపులాట తో పాటు, కనీస దూరం పాటించే నియమం కూడా ఉల్లంఘించబడిందన్నారు. దీంతో పాటు,

విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా 144 వ సెక్షన్ అమలు లో ఉందని, నలుగురు మనుషులు కలిసి ఒక చోట ఉండకూడదన్నారు. గుంపుగా వెళ్లడం నేరం అవుతుందన్నారు. ఇప్పడికే ఈ నిబంధనలను

ఉల్లంఘించిన సామాన్య ప్రజలపై 10 కేసులను వివిధ మండలాల్లో ఇప్పడికే నమోదు చేశామన్నారు. సోమవారం సాయంత్రం 6 à°—à°‚à°Ÿà°² నుంచి మండలవారం  à°¸à°¾à°¯à°‚త్రం 6 à°—à°‚à°Ÿà°² వరకూ లాక్ డౌన్

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 130 కేసులు , ట్రాఫిక్ ఉల్లంఘల లో 1434 కేసులు నమోదు చేశామన్నారు. 18 వాహనాలను స్వాధీనం చేసుకుని, మొత్తం రూ. 7 లక్షల 84 వేలు జరిమానా విధించడం

జరిగిందన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam