DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశంలోని రెడ్ జోన్లు ఆరంజ్ లోకి రావాలి: కేంద్ర ప్రభుత్వం  

*దేశ వ్యాప్తంగా హాట్ స్పాట్ లను ప్రకటించిన కేంద్రం*

*మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశం:* 

*నేషనల్ హెల్త్ మిషన్ కేంద్ర కార్యదర్శి ప్రీతి

సుడాన్ సూచన* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 15, 2020 (డిఎన్ఎస్) : కరోనా మహమ్మారి రాక్షసుణ్ణి కట్టడి నిరోధించేందుకు దేశ

వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన కేంద్రం, అత్యంత ప్రమాదకరమైన జిల్లాల్లో మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఆదేశించింది. వీటిలో ఆంధ్ర ప్రదేశ్ లో పలు కీలక

ప్రాంతాలున్న జిల్లాలను ప్రకటించింది. వాటిల్లో తీసుకోవాల్సిన చర్యలను కూడా తెలియచేసింది.  

మరింత కట్టుదిట్టమైన చర్యలు: 

ఈ మేరకు నేషనల్ హెల్త్ మిషన్,

కేంద్ర కార్యదర్శి ప్రీతి సుడాన్ పేరిట విడుదలైన ప్రకటనలో ఆంధ్ర ప్రదేశ్లోని హాట్ స్పాట్ జిల్లాలను ప్రకటించింది. వాటిల్లో కర్నూల్, గుంటూరు, శ్రీ పొట్టి

శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, వై ఎస్ ఆర్ కడప, పశ్చిమ గోదావరి, చిత్తూర్, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనంతపూర్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలో ప్రతి సోమవారం,

లేదా అంతకు ముందుగానే పూర్తి సమీక్షలు నిర్వహించాల్సి యుంది.  

చివరి సారిగా నెగటివ్ వచ్చిన నాటి నుంచి 28 రోజుల పాటు ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కాక పొతే ఆ

ప్రాంతాన్ని రెడ్ జోన్ నిబంధనల్లో కొంత సడలింపు ఉండవచ్చు. ఆ తర్వాత 14 రోజుల పాటు ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కాకపోతే ఆ ప్రాంతాన్ని ఆరంజ్ జోన్ గా గుర్తించడం

జరుగుతుంది.  à°† తర్వాత 28 రోజుల పాటు ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కాకుంటే à°† ప్రాంతాన్ని గ్రీన్ జోన్ à°—à°¾ గుర్తించడం జరుగుతుందని ప్రకటించారు.  

ప్రస్తుత లాక్

డౌన్ కాలంలో అన్ని రెడ్ జోన్ ప్రాంతాలూ ఆరంజ్ జోన్ à°—à°¾ మారే విధంగా అందరూ కృషి చెయ్యాలని సూచించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam