DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రత్యక్ష సేవతో ప్రజల ముంగిట కు పోస్టల్ సిబ్బంది . . . 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .

విశాఖపట్నం, ఏప్రిల్ 17, 2020 (డిఎన్ఎస్) :ఇంతకాలం ప్రజలకు ప్రభుత్వ తరపున సేవలు అందిస్తున్న పోస్టల్ / తపాలా శాఖ అధికారులు ,

ఇతర  à°¸à°¿à°¬à±à°¬à°‚ది ప్రత్యక్ష సేవతో ప్రజల ముంగిటకు వచ్చారు. విశాఖపట్నం పరిధిలోని తపాలా సిబ్బంది స్వచ్చందంగా ఆర్ధిక సేకరణ చేసి, నగర పరిధిలోని పలు కోవిడ్

క్వారంటైన్ కేంద్రాల్లో ఆహార పదార్ధాలు, ఇతర సామాగ్రి పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చారు. వీరు సేకరించిన సామాగ్రి తో కూడిన వాహనాన్ని, విశాఖ లోని పోస్ట్ మాస్టర్

జనరల్ కార్యాలయం వద్ద పోస్ట్ మాస్టర్ జనరల్ ఎం. వెంకటేశ్వర్లు జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన తమ సిబ్బందిని అభినందించారు. నిత్యం ప్రజలతో మమేకమై విధులు

నిర్వహించే సిబ్బంది వారికీ చేయూత ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇదే సమయంలో సిబ్బంది రక్షణ కోసం శానిటైజర్లు, మాస్క్ లు, ఇతర రక్షణ సామాగ్రిని

పోస్టల్ శాఖ అందించిందన్నారు. ప్రధానంగా ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కల్గి ఉన్న విభాగాల్లో పోస్టల్ శాఖ మొదటి వరుసలో ఉంటుందన్నారు. ఆధార్ కార్డు మార్పులు,

చేర్పులు, బ్యాంకింగ్ విభాగం, తదితర సేవలను యధావిధిగా కొనసాగిస్తున్నామన్నారు. 

సుమారు 700 మందికి సామాగ్రిని అందించేందుకు తొలి విడత సిద్దం చేసారు. వీటిని

నగరం లోని వేమన మందిరం, సుబ్బలక్ష్మి కల్యాణ మండపం, స్వామి వివేకానంద కల్యాణ మండపం, తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలలో పంపిణీ చేసారు. వివిధ

ప్రాంతాల నుంచి వచ్చి విశాఖ లో చిక్కుకు పోయిన వలస కార్మికులు, పెదాలు ఈ కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ప్రజల కోసం చేయూత ఇచ్చేందుకు ముందుకు వచ్చిన తపాలా

శాఖ సిబ్బంది ని పోస్ట్ మాస్టర్ జనరల్ వెంకటేశ్వర్లు అభినందించారు. 

ఈ కార్యక్రమం లో పోస్టల్ శాఖ సీనియర్ సూపరెంటెండెంట్ -ఎన్ సోమశేఖర్ రావు, ఎస్ ఆర్ ఎం జె.

ప్రసాద్ బాబు, అసిస్టెంట్ డైరక్టర్ డబ్ల్యు  à°¨à°¾à°—దిత్య,  à°®à°¾à°°à±à°•à±†à°Ÿà°¿à°‚గ్ అధికారి ఉమా మహేశ్వర రావు, సీనియర్ అధికారి నాగేశ్వర రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam