DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా ను కట్టడి చెయ్యాలంటే కఠినంగా ఉండాల్సిందే: ఏలూరు డిఐజి.

*సుమారు 80 వేల కేసులు - రూ. 4 .6 కోట్ల ఫైన్ వసూలు : . .*

*అత్యవసర కేసుల్లోనే అనుమతులు:ఏలూరు డిఐజి మోహన్ రావు*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). .

.*

అమరావతి, ఏప్రిల్ 17, 2020 (డిఎన్ఎస్) : కరోనా మహమ్మారి రాక్షసుణ్ణి కట్టడి చెయ్యాలంటే పోలీస్ సిబ్బంది కఠినంగా ఉండాలని ఏలూరు రేంజ్ డీఐజీ కే. వి. మోహన్ రావు

తెలియచేస్తున్నారు.  à°²à°¾à°•à± డౌన్ 2 నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగోలను లో ఉన్న రెడ్ జోన్ ప్రాంతంలో  à°µà°¦à±à°¦ ఏలూరు రేంజ్ డీఐజీ కే. వి. మోహన్ రావు

శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అక్కడ ఉన్న సిబ్బందికి  à°µà°¿à°§à±à°²à°²à±‹ నిక్కచ్చిగా వ్యవహరించాలని సూచించారు. సానుభూతి వద్దని, 1% మెతక వైఖరిగా ఉన్నా కూడా

అనర్ధం జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఏలూరు రేంజ్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగతున్నందున సిబ్బంది మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రధానంగా రెడ్ జోన్

లలో విధులు నిక్కచ్చిగా నిర్వర్తించాలని, మార్కెట్స్ / దుకాణాల వద్ద క్యూలైన్లు సక్రమంగా లేకపోతే తప్పనిసరిగా తగిన చర్యలు తీసుకొని క్యూ లైన్లను ఉండేలా

చూడాలన్నారు. 

ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లా లో 34  à°•à°°à±‹à°¨à°¾ పాజిటివ్ కేసులు ఉన్నా యి కనుక ఎలాంటి మెతకవైఖరి లేకుండా రెడ్ జోన్ లలో విధులు నిక్కచ్చిగా

నిర్వర్తించాలని, మార్కెట్స్ / దుకాణాల వద్ద క్యూలైన్లు సక్రమంగా లేకపోతే తప్పనిసరిగా తగిన చర్యలు తీసుకొని క్యూ లైన్లను మెయింటెన్ చేయాలని తెలిపారు.

 

ప్రజలలో ఇంకా పూర్తి అవగాహన, బాధ్యత రాలేదని, ప్రజలు బాధ్యతగా ఉండే విధంగా తగిన చర్యలు చేపట్టాలని తెలియ జేశారు. 

పోలీస్ సిబ్బంది ఎంత స్ట్రిక్ట్ గా

విధులు నిర్వహిస్తే, పాజిటివ్ కేసులు అంతగా తగ్గుతాయని, కనుక మనం అలసత్వం వహించకుండా కఠినంగా వ్యవహ రించాలని, వైరస్ వ్యాప్తి జరుగ కుండా, అవసరమైన చర్యలు

చేపట్టాలని, నిబంధనలను ఉల్లంఘించే వారిపైన à°•à° à°¿à°¨ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  à°•à°¨à±à°• అందరూ విధులలో కఠినంగా వ్యవహరించాలని కోరారు.

ఏలూరు రేంజ్ ఏలూరు

 à°ªà°°à°¿à°§à°¿ లో విధుల్లో పాల్గొనే సిబ్బందికి, అధికారులకు నాణ్యమైన శానిటైజర్లు, మాస్కులు తదితర వ్యక్తిగత రక్షణ సామాగ్రి ని అందిస్తున్నామని, సిబ్బంది కూడా

అప్రమత్తంగా ఉండాలన్నారు. 

80 వేల కేసులు - రూ. 4 .6 కోట్ల ఫైన్ వసూలు : . . .    

ఏలూరు రేంజి పరిధిలో ఇంతవరకూ లాక్ డౌన్ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారి పై 79,925 కేసులు

నమోదు చేసి,  à°°à±‚. 4 కోట్లు 60 లక్షలు జరిమానా వసూలు చేశామని ఏలూరు రేంజ్ డిఐజి మోహన్ రావు తెలిపారు. à°ˆ రేంజ్ లో 27 రెడ్ జోన్  à°ªà±à°°à°¾à°‚తాలు ఉన్నాయని, వాటిల్లో నిబంధనలు

ఉల్లంఘించిన వారి పై 6,900  à°•à±‡à°¸à±à°²à± నమోదు పరిచినట్లు 9,670  à°®à°‚దిని అరెస్టు చేసినట్లు కూడా తెలిపారు. సుమారు 7000 వాహనములను స్వాధీనపరచుకుని వారిపై కేసులు నమోదు చేసినట్లు à°—à°¾

తెలిపారు. 

అత్యవసర కేసుల్లోనే అనుమతులు: . . . 

వైద్య పరంగా, ఇతర  à°…త్యవసర పరిస్థితులు తలెత్తిన సమయాల్లోనే ప్రయాణాలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని డిఐజి

తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వవచ్చని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌరవ గౌతమ్ సవాంగ్  à°…న్ని జిల్లాల ఎస్పి లకు à°†à°¦à±‡à°¶à°¾à°²à± జారీచేశారన్నారు. à°ˆ ఏలూరు

రేంజ్ లో అనుమతులు కావాల్సిన వారు. . ..  

పశ్చిమ గోదావరి జిల్లా ఫోన్ నెంబర్ : 8332959175, తూర్పు గోదావరి జిల్లా ఫోన్ నెంబర్ : 9494933233, రాజమహేంద్రవరం ఫోన్ నెంబర్ : 9490760794, కృష్ణా జిల్లా

యొక్క ఫోన్ నెంబరు : 9182990135 వాట్సాప్ నెంబర్ ఫోన్ లకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ముందుగా తెలిపిన దరఖాస్తు నమూనాలో ఆయా జిల్లాల ఎస్పీ లకు సమాచారం ఇచ్చి అనుమతి

పొందాలన్నారు. 

à°ˆ పర్యటనలో  à°¡à°¿à°à°œà°¿ తో పాటు భీమడోలు సిఐ. à°Žà°‚. సుబ్బారావు, భీమడోలు ఎస్ఐ కే శ్రీహరి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam