DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సముద్ర మార్గం లో వచ్చిన  మత్స్యకారులపై క్రిమినల్ కేసు

*కరోనా వ్యాప్తి చెందే ఛాన్స్ - అక్రమంగా రావద్దు: కలెక్టర్* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 19, 2020 (డిఎన్ఎస్) :  à°•à±‹à°µà°¿à°¡à±

– 19 లాక్ డౌన్ నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తూ  à°¸à°®à±à°¦à±à°° మార్గంలో శ్రీకాకుళం జిల్లాకు చేరిన మత్స్యకారులపై పోలీసులు క్రిమినల్ కేసును నమోదు చేసారు.  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా

కవిటి మండల తహశీల్దారు పిర్యాధు మేరకు  à°µà±€à°°à°¿à°¨à°¿ అదుపులోకి తీసుకున్నారు. లాక్ డౌన్ నేపధ్యం లో వివిధ ప్రాంతాల్లో చిక్కుకు పోయిన వారు స్వగ్రామాలకు చేరేందుకు

సముద్ర మార్గాన్ని ఎంచుకున్నారు. పోలీసులకు సమాచారం రావడం తో తీరప్రాంతంలో పఠిష్టమైన భద్రతా ఏర్పాటు చేసారు. 

 à°•à±‡à°‚ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్

నివారణలో భాగంగా లాక్ డౌన్ అమలు చేస్తూ ప్రజలు ఎవరూ రాకపోకలు సాగించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా జిల్లాలో 144 వ సెక్షన్ ను విధిస్తూ

కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ జె నివాస్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

జిల్లాలోకి ఎవరూ ప్రవేశించకుండా అంతర్ జిల్లా, రాష్ట్ర సరిహద్దులలో

పోలీసు చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసిన సంగతి విదితమే. చెక్ పోస్టుల వద్ద రేయింబవళ్ళు గట్టి నిఘా పెట్టడం జరిగింది. ఈ నేపధ్యంలో శని వారం అర్ద రాత్రి కవిటి

మండలం ఇద్దివాని పాలెంకు మత్స్యకారులు చేరుకోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. 

జిల్లాకు చేరుకున్న వెంటనే వారిని ప్రత్యేక వాహనంలో రాజాపురం క్వారంటీన్

కేంద్రానికి ప్రత్యేక వాహనంలో తరలించారు. అతి భయంకరమైన కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా లాక్ డౌన్ అమలు చేస్తూ ప్రజల రాకపోకలపై పూర్తి నిషేధం ఉన్న సంగతి

తెలిసిందే. సముద్ర తీర ప్రాంతం గుండా అక్రమంగా రావడాన్ని నేరంగా పరిగణిస్తూ మత్స్యకారులపై కేసును నమోదు చేసారు. వారికి అవగాహనా కల్పించి, క్వారంటైన్

కేంద్రాలకు తరలించారు. 

కరోనా వ్యాప్తి చెందే ఛాన్స్ - అక్రమంగా రావద్దు: కలెక్టర్ 

అక్రమ చొరబాటుదారుల వలన జిల్లాలో కరోనా ప్రభలే అవకాశాలు ఉన్నాయని

జిల్లా కలెక్టర్ జె నివాస్ చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా వ్యాప్తి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. దేశ, విదేశాల నుండి వచ్చిన

వారిని క్వారంటీన్ లో పెట్టి ప్రతి క్షణం పరిశీలన చేసామని చెప్పారు. క్వారంటీన్ సమయం దాదాపుగా అందరికి పూర్తి అయిందని ఇప్పటి వరకు జిల్లాలో కరోనా ప్రభావం

ఎక్కడా కనిపించక పోవడం కొంత ఉపశమనం కలిగించినప్పటికి అక్రమ చొరబాటుదారుల వలన ప్రమాదం ఉందని పేర్కొన్నారు. జిల్లాలోకి ఎవరు అక్రమంగా చొరబడినా క్రిమినల్

కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని కలెక్టర్ అన్నారు. జిల్లాలోకి ఎవరూ ప్రవేశించ వద్దని ఆయన కోరారు.  à°°à°¹à°¦à°¾à°°à°¿ మార్గం మాత్రమే కాకుండా రణస్ధలం నుండి ఇచ్ఛాపురం

వరకు తీర ప్రాంతంలో అప్రమత్తం చేసామని ఆయన చెప్పారు. గ్రామాలకు రహదారి, తీర ప్రాంతాల గుండా ఎవరు వచ్చినా తక్షణం సమచారాన్ని 9491222122, 08942 240699 ఫోన్ నంబర్లకు తెలియజేయాలని

కోరారు. ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని, లాక్ డౌన్ లోనూ, వ్యాధి ప్రభలకుండాను ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. మరి కొద్ది రోజులు అతి

కీలకమని, ప్రజలు సంయమనంతో వ్యవహరించి కరోనా జిల్లా దరికి చేరకుండా తోడ్పడాలని పిలుపునిచ్చారు.  

పరీక్షల తరువాత విడుదల :  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ క్వారంటీన్ లో ఉన్నవారు

కనీసం 21 రోజుల క్వారంటీన్ కాలాన్ని పూర్తి చేసుకన్నప్పటికి కరోనా పరీక్షల ఫలితాల నివేదకల ఆధారంగా విడుదల చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. 14 రోజులు వైరస్

ఇంక్యుబేషన్ సమయమని, ఆరోగ్య వంతుల్లో 14 రోజులు తరువాత కూడా పాజిటివ్ వస్తున్నాయని, కావున కనీసం 21 రోజులు గమనించి వారికి పరీక్షలు నిర్వహించి నెగిటివ్ వచ్చిన

వారికి మాత్రమే విడుదల చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam