DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరి పై సహస్ర ఘటాభిషేకం.. సంక్షిప్తమా?.. పరిపూర్ణమా? 

*సింహగిరి పై చందన యాత్ర ఘటాభిషేకం నిర్వహణ ఎలా. .? 

*కేవలం 15 మంది వైదిక సిబ్బంది తోనే చందనయాత్ర. . .*

*నైరాశ్యంలో సంప్రదాయ శ్రీ వైష్ణవ స్వాములు, భక్త

బృందాలు. . .*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 20, 2020 (డిఎన్ఎస్) : దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో విశాఖ సమీపంలోని

సింహాచల క్షేత్రం లో  à°µà±†à°²à°¸à°¿à°¨ శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దివ్యక్షేత్రంలో కూడా భక్తులకు ద్వారాలు మూసుకుపోయాయి. 

ఈ సమయంలోనే వైశాఖ శుద్ధ తదియ ( అక్షయ

తృతీయ) రోజు  à°à°¡à°¾à°¦à°¿ à°•à°¿ ఒక్కసారే లభించే స్వామి నిజరూప దర్శనం చందన ఉత్సవం కూడా రావడంతో ప్రభుత్వ ఆదేశాల నిబంధనల ప్రకారం à°ˆ వేడుకలను కూడా ఏమాత్రం ఆర్భాటం లేకుండా

ఏకాంతంలో నిర్వహిస్తున్నారు. భక్తుల రక్షణ కోసమే కేవలం ఏకాంతంలోనే ఉత్సవాలు కూడా జరుపుతున్నట్టు అధికారులు తెలియచేస్తున్నారు. 

సహస్ర ఘటాభిషేకం

నిర్వహించేది ఎలా?

ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ తదియ ( అక్షయ త్రితీయ) రోజున స్వామి పై ఉన్న 500 కిలోల చందన సమర్పణ ను పూర్తిగా తొలగించి, స్వామి నిజరూపాన్ని భక్తులకు

అనుగ్రహిస్తుంటారు. అదే రోజు సాయంత్రం సుమారు 400 మంది పంచ సంస్కరపరులు, వైదిక స్వరూపులైన శ్రీవైష్ణవ స్వాములు గంగ ధార నుంచి తీసుకు వచ్చే కళాశాలతో స్వామికి నేరుగా

నిజ రూపం లో దర్శనమిచ్చే శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ వైదిక ప్రక్రియ ఇటీవల కాలంలోనే, దేవాదాయ శాఖా వచ్చిన తర్వాతో ఆరంభమైన

ప్రక్రియ కాదు. అనాది కాలంగా వందలాది సంవత్సరాలుగా ఆచారంగా వస్తున్న వైదిక ప్రక్రియ. 

శ్రీవిశిష్టాద్వైత ప్రవర్తకులు భగవద్రామానుజులు à°ˆ  à°•à±à°·à±‡à°¤à±à°°à°‚ లో

మంగళాశాసనం చేసిన సమయంలో ఇక్కడ జరుగుతున్న వైదిక ప్రక్రియలో కొన్ని సూచనలు చేయడం జరిగింది, దానిలో భాగంగానే కేవలం పంచసంస్కారపరులైన శ్రీవైష్ణవ సంప్రదాయ

స్వాములకు గంగాధర నుంచి పవిత్ర జలంతో స్వామికి జరిగే ప్రత్యక్ష సహస్ర ఘటాభిషేకం చేసే సేవను అనుగ్రహించారు. ఈ అభిషేక మహోత్సవం సుమారు రెండు నుంచి మూడు గంటల సమయం

కొనసాగుతుంది. వీటికి అదనంగా భారీ సంఖ్యలో రజత కళాశాలతో పంచామృత అభిషేకం కూడా జరుగుతుంది. పంచామృత అభిషేకం ఇది అర్చక సిబ్బంది మాత్రమే చెయ్యడం

జరుగుతుంది. 

అనంతరం స్వామికి తిరిగి తోలి విడత మూడు మణుగుల ( సుమారు 125 కేజీల) చందన సమర్పణ  à°šà±‡à°¯à°¡à°‚ జరుగుతుంది.  

ఇంతమంది స్వాములు సహకారంతో అత్యంత వైభవంగా

జరిగే ఈ వైభవాన్ని కేవలం 15 మంది అర్చక సిబ్బంది తో మాత్రమే నిర్వహించేందుకు ఈ ఏడాది నిర్ణయం తీసుకున్నారు. మరి మూల విరాట్ కు కచ్చితంగా సహస్ర ఘటాభిషేకం జరగాల్సి

యుంది. ఈ సేవను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపి వెయ్యడానికి లేదు. ఈ సారి దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో భక్తులకు ఆలయంలోకి ప్రవేశం లేకపోవడం ఘటాభిషేకం లో

పాల్గొనేందుకు ప్రతి సారి వచ్చే వందలాది మంది వైష్ణవ స్వాములు మాత్రం చాలా నిరాశకు లోనవుతున్నారు. స్వామి దర్శనం లభించక సామాన్య భక్తులు సైతం ఇదే భావనలో

ఉన్నారు. 

సహస్ర ఘటాభిషేకం . . సంక్షిప్తమా? . . పరిపూర్ణమా? . . . . 

ఇంత విస్తృతంగా జరిగే సహస్ర ఘటాభిషేకం సేవను కేవలం 15 మంది మాత్రమే నిర్వహించడమూ కష్టతరమే.

దీనికై ప్రత్యామ్నాయ మార్గాలనూ వెతికి ఈ సేవను సంక్షిప్తం చేసే అవకాశమూ లేకపోలేదు. ముందుగా ఉదయం నుంచే గంగ ధర నుంచి ఆలయంలోని గంగాలల్లో నింపి, సాయంత్రం ఆ

జలంతో అభిషేకం చేసే అవకాశం ఉండవచ్చు. 

లేదా అర్చకులు పూర్తిగా శ్రమించి పూర్తిగా సహస్రఘటాభిషేక జలాన్ని ప్రతి కలశ నూ గంగాధర నుంచే తీసుకు వచ్చినా ఆశ్చర్య

పోనక్కరలేదు. ఇదే జరిగితే వాళ్లంతా అదృష్టవంతులు ఉండరు.     

ఈ పర్యాయం ఆలయంలో జరిగే అక్షయ తృతీయ వేడుకలు చిరకాలం గుర్తుండేలా గా ఉండబోతున్నాయి. సేవల్లో

ఎటువంటి లోటు లేకుండా యధావిధిగా అదే క్రమం లో జరిగితే అవి చరిత్ర సృష్టించబోతున్నాయి, లేదా సేవలను కుదించి, సంక్షిప్తం చేస్తే అది కూడా రికార్డులోకి ఎక్క

నుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam