DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే కౌంటర్ల వద్ద కనీస దూర మార్కింగ్ లు సిద్ధం

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .

విశాఖపట్నం, ఏప్రిల్ 20, 2020 (డిఎన్ఎస్) : కరోనా మహమ్మారి రాక్షసుణ్ణి నిరోధించేందుకు దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న

లాక్ డౌన్ తో పాటు కనీస దూరం తప్పని సరి కావడంతో విశాఖపట్నం రైల్వే డివిజినల్ మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవాస్తవ ఆదేశాల మేరకు రైల్వే అధికారులు అన్ని టికెట్

కౌంటర్ల వద్ద తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ విభాగం సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సునీల్ కుమార్ అందించిన సమాచారం

ప్రకారం విశాఖపట్నం, విజయనగరం, తదితర అన్ని రైల్వే కేంద్రాల్లోనూ ప్రయాణీకులు నిలబడేందుకు అనువుగా టికెట్ లు ఇచ్చే ప్రతి కౌంటర్ వద్ద, విచారణ కేంద్రాలు, ఫుడ్

కౌంటర్ లు, ఇలా ప్రజలు వచ్చేందుకు అవకాశం ఉన్న ప్రతి చోటా రెండు అడుగులు దూరం ఉండేలా సర్కిల్ మార్కింగ్ లను ఏర్పాటు చేసారు. త్వరలోనే సాధారణ రైల్వే కార్యకలాపాలు

మొదలయ్యే అవకాశాలు ఉన్నందున రైల్వే అధికారులు తమ కార్యాచరణను మొదలు పెడుతున్నారు. 

కరోనా ఒక అంటువ్యాధిగా మారినందున జన సంచారం అధికంగా ఉండే రైల్వే

స్టేషన్ లు, రైళ్లు, ఇతర కేంద్రాలను గత నెల 22 నుంచి మూసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తిరిగి కార్యకలాపాలు మొదలైనప్పటికీ ఈ వ్యాధి విస్తరించకుండా, అన్ని ఆరోగ్య

వంతమైన జాగ్రత్తలనూ రైల్వే శాఖా అనుసరిస్తోంది. దీనిలో భాగంగానే విశాఖపట్నం రైల్వే డివిజనల్ మేనేజర్ కార్యాలయంలో ప్రతి ఉద్యోగి చేతులను పరిశుభ్రంగా

కడుక్కునే విధంగా కార్యాలయం బయటే మంచినీటి కుళాయిలు, శానిటైజర్లు, సబ్బులు, అన్నీ ఏర్పాటు చేశారు. కార్యాలయంలో ప్రవేశించే ప్రతి ఒక్కరికీ ధర్మల్ స్కాన్ ద్వారా

శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించిన తర్వాతే అనుమతించారు. 

రవాణా యధాతధం. :. . . 

ప్రయాణీకుల సేవలు అందించే సాధారణ ప్యాసింజర్లు, ఎక్స్ ప్రెస్ లు, సూపర్ ఫాస్ట్

తదితర అన్ని ప్రయాణీకుల రైళ్లనూ పూర్తిగా నిలిపివేసినప్పడికీ, సరకు రవాణా గూడ్స్ రైళ్లను యధాతధంగా నడుపుతూనే ఉంది రైల్వే శాఖా. పూర్తి స్థాయిలో యధాస్థితికి

 à°°à°¾à°µà°¾à°²à°¨à°¿ ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam