DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్ధిక నష్టం వస్తోంది అయినా ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యత

*ప్రజలకు ప్రత్యేక అధికారి పి.వి.ఎస్.ప్రసాద్  à°…వగాహనా. .* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 20, 2020 (డిఎన్ఎస్) : కరోనా

వ్యాప్తిని అరికట్టడంలో ఆర్ధిక భారం వస్తున్నప్పటికీ ప్రజల ప్రాణాలకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇచ్చారని శ్రీకాకుళం మండల ప్రత్యేక

అధికారి పి.వి.ఎస్.ప్రసాద్ తెలిపారు. లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్ధకు రోజుకు కనీసం 40 వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుందని ఆయన అనారు. కరోనా వ్యాప్తి

నివారణలో భాగంగా దమ్మల వీధిలో సచివాలయ సిబ్బందితో ఇంటింటి పరిశీలన చేసారు. ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ కట్టడికి తీసుకోవలసిన చర్యలను

వివరించారు. వేల కోట్ల రూపాయలను నష్టపోతూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తుందని, అంటే మనిషి ప్రాణాల కోసం ఎంత వరకు త్యాగం చేస్తున్నారో

గమనించాలని పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలని అందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే ఉంటూ సహకరించాలని అన్నారు. ప్రభుత్వానికి భారమైనా

ప్రజలు ఇబ్బందులకు గురి కారాదని పథకాలను అమలు చేస్తూ ఉచితంగా అందిస్తున్న సంగతిని గుర్తు చేసారు. ఇంటి వద్దనే ఉంటూ ఇంటిలో లభ్యమయ్యే పదార్ధాలతో రోగ నిరోధక

శక్తి పెంచుకోవాలని సూచించారు. బయటకు ఇష్టానుసారం తిరగడం వలన ఒంటికి, ఇంటికి అనారోగ్యం పాలు చేస్తున్నామనే సంగతి గుర్తించాలని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి

కంటికి, ఒంటికి కనిపించనిదని, అయితే వస్తే వదిలి పెట్టి వెళ్ళే రకం కాదని అన్నారు. మనకు ఏమి అవుతుందిలే అనే ధీమా ఉండకూడదని స్పష్టం చేసారు. వైరస్ అతి సూక్ష్మ

క్రిమి అని ప్రపంచాన్నే గడగడలాడిస్తుందని గుర్తించాలని తెలిపారు. వ్యక్తుల మధ్య కనీసం మీటరు దూరం పాటించడం ఆరోగ్యానికి మంచిదని, నమస్కారం శ్రేయస్కరమని

పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలపై ఇద్దరు, ముగ్గురు ప్రయాణించడం అతి ప్రమాదకరమని అన్నారు. కరోనా ఎవరిలో ఉందో గుర్తించడం కష్టమని జాగ్రత్తలే ముఖ్యమని అన్నారు.

సెలూన్ల వలన వైరస్ ప్రభలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుర్తించాలని సూచించారు. ఒకే కుర్చీపై ఎంతో మంది కూర్చుంటారని, అవే పరికరాలను అందరికి ఉపయోగించడం

జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా సొంత నిధులతో మాస్కులు, గ్లోవ్స్ ను పంపిణీ చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam