DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జర్నలిస్టులకు బీమా కల్పించాలి : ఐ జె యు డిమాండ్

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 21, 2020 (డిఎన్ఎస్) : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో విధి నిర్వహణలో అనేక సవాళ్లు

ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజెయు) అధ్యక్షులు గీతార్థ పాఠక్, సెక్రటరీ జనరల్ సబీనా

ఇంద్రజిత్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం నాడు ఢిల్లీలో వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ముంబై నగరంలో 67 మంది జర్నలిస్టులకు, తమిళనాడులో మరికొందరు

జర్నలిస్టులకు కరోనా వ్యాధి సోకడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి నిరోధానికి మొదటి వరుసలో నిలిచి పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య

సిబ్బంది మాదిరిగానే జర్నలిస్టులు కూడా కుటుంబాలకు దూరంగా  à°‰à°‚టూ విధి నిర్వహణలో పాల్గొంటున్నారని వారు తెలిపారు. మీడియా యాజమాన్యాలు కూడా విధి నిర్వహణలో

పాల్గొంటున్న జర్నలిస్టులకు శానిటైజర్లు, మాస్కులు అందించి వారితో పని చేయించుకోవాలని కోరారు. జర్నలిస్టులు కూడా వ్యక్తిగత రక్షణ పట్ల శ్రద్ధ చూపాలని వారు

విజ్ఞప్తి చేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam