DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కృష్ణ కిషోర్ కు ప్రిన్సిపాల్ చీఫ్ కమిషనర్ గా పదోన్నతి: కేంద్రం ఆదేశం*

*వైకాపా హయం లో సస్పెన్షన్, విలువ తెల్సి బీజేపీ పదోన్నతి. . .*

*రిలీవ్ చేయడంలోనూ కేంద్రం ఆజ్ఞలు బేఖాతరు చేసిన ఏపీ*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్

కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 22, 2020 (డిఎన్ఎస్) : ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణ కిషోర్ కు కేంద్ర ప్రభుత్వం

ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌à°—à°¾ పదోన్నతి కల్పిస్తూ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని

ఆదేశించింది. ఈ నిర్ణయం తో రాష్ట్రంలోని ఐఏఎస్ లకు కొత్త జీవం వచ్చినట్లయ్యింది. గత తెలుగుదేశం పార్టీ హయాంలో విధులు నిర్వహించిన వారందరిని ప్రాధాన్యత లేని

పోస్ట్ లు ఇవ్వడమో, లేక సెలవు ఇచ్చి ఇంటికి పంపడమో చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో సీనియర్ లుగా, ఉత్తమ అధికారులుగా పేరు సంపాదించిన వారెందరో అంతర్మధనం

పడుతున్న విషయం తెలిసిందే. ఇలా స్థానచలనం కలిగిన వారిలో మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏ ఎస్ అధికారి ఎల్ వి సుబ్రహమణ్యం లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే

కొందరు తమ భవిష్యత్ కోసం కోర్టు లు / క్యాట్ ను ఆశ్రయించారు. అయితే వీరి ట్రాక్ రికార్డ్ చూసిన కేంద్ర ప్రభుత్వం నేరుగా రంగం లోకి దిగి సీనియర్ ల నిజాయితీ కి తగిన

గుర్తింపు ఇచ్చేందుకు సిద్ద పడినట్టు తెలుస్తోంది. దానిలో భాగమే కృష్ణ కిషోర్ కు పదోన్నతి కల్పిస్తూ. . .ఢిల్లీ లో రిపోర్ట్ చెయ్యమని ఆదేశించడం. తన పై పడిన వేటును

ఛాలెంజ్ చేస్తూ కృష్ణ కిషోర్ క్యాట్ ను ఆదేశించిన విషయం తెలిసిందే. . క్యాట్ ఈ వేటు పై స్టే ఇవ్వడం తో ఈయన కేంద్రానికి రిపోర్ట్ చేసారు. వెంటనే ఈయనకు కేంద్రం

పదోన్నతి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

ఆదాయ పన్ను శాఖ చీఫ్‌ కమిషనర్‌ కృష్ణ కిషోర్‌కు పదోన్నతి లభించింది. కృష్ణ కిషోర్‌కు టీడీపీ ప్రభుత్వ హయాంలో

ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి(ఈడీబీ) సీఈవోగా కృష్ణకిషోర్ పనిచేశారు. అయితే.. ఈడీబీ సీఈవోగా కృష్ణకిషోర్ వ్యవహరించిన సమయంలో అవకతవకలు జరిగాయని ఆయనను వైసీపీ

ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam