DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అత్యంత గోప్యంగా ఉత్తరాంధ్ర జనసేన కార్యాలయం ప్రారంభం

అత్యంత గోప్యంగా ఉత్తరాంధ్ర జనసేన కార్యాలయం ప్రారంభం.

విశాఖపట్నం, జులై  3 , 2018 (DNS Online ): జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం విశాఖనగరం లో ఉత్తరాంధ్ర జిల్లాల

పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. విశాఖ నగరం లోని సీతమ్మధార లో à°—à°² బృందావనం పార్క్ వద్ద  à°‰à°¨à±à°¨ గుంటూరు నర్శింహారావు నివాసం లో పార్టీ కార్యాలయాన్ని ఆయన

ప్రారంభించారు. అత్యంత గోప్యంగా జరిగిన ఈ కార్యక్రమానికి పేరెన్నిక గల నాయకులు కానరాకపోవడం గమనార్హం. అయితే ఇటీవలే కాంగ్రెస్ ను వీడి జనసేన వైపు మ్రొగ్గు

చూపిన పారిశ్రామిక వేత్త బొలిశెట్టి సత్యనారాయణ, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి గుంటూరు నర్సింహమూర్తి, అయన సతీమణి విశాఖ ఉత్తర నియోగజక వర్గ  à°•à°¾à°‚గ్రెస్

ఇంచార్జి మినహా మరో నేత లేకపోవడం గమనార్హం. అయితే పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో జరిగిన పలు ఘటనలు, వెనుక ఉన్న క్యాడర్ ఆంక్షలే దీనికి కారణంగా

తెలుస్తున్నాయి. కేవలం సినిమా షూటింగ్ తరహాలో సామాన్యులను దగ్గరకి రానివ్వక పోవడం తో పార్టీ పట్ల ఆసక్తి ఉన్న వారు సైతం దూరంగానే ఉంటున్నట్టు అభిమానులే

ప్రకటిస్తున్నారు. దీనికి తోడు మీడియా పై సంపూర్ణ ఆంక్షలు విధించడం మరో కారణం గా చెప్పవచ్చు. కేవలం కొన్నింటికి మాత్రం అనుమతిస్తూ, సమావేశాలు, సదస్సులకు మీడియా

ను వెలివేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ పార్టీ అంటే ప్రజలకు దగ్గరగా వెళ్ళేది అనే మాట కు భిన్నంగా పార్టీ కమిటీ తీరు ఉండడం చూస్తే.... రానున్న

ఎన్నికల్లో జనసేన ఏ విధంగా ప్రజల నమ్మకాన్ని పొందుతుందో వాళ్ళకే తెలియాలి. అయితే పవన్ ని ఒక సినీ యాక్టర్ గానే చూస్తున్న అభిమానులు, ప్రజలు మాత్రం మంగళవారం వర్షం

పడుతున్న సరే అతన్ని చూడడం కోసం వేచియున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam