DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్ని జిల్లాల్లోనూ కరోనా పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తున్నాం

*ఏపీలో మండలాలు : 573 గ్రీన్‌ జోన్‌లో, 47 ఆరెంజ్‌ జోన్‌లో. .*

*ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వెల్లడి*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్

కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 23, 2020 (డిఎన్ఎస్) : రాష్ట్రంలోని 893 కరోనా కేసుల్లో అత్యధికంగా నాలుగు జిల్లాల్లోనే నమోదయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. నమోదైన వాటిలో 590 కేసులు 4 జిల్లాల్లోనే ఉన్నట్లు వివరించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన

మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో 573 మండలాలు గ్రీన్‌ జోన్‌లో.. 47 మండలాలు ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయని చెప్పారు. సరిగా పరీక్షలు నిర్వహించడం లేదనే విమర్శలు సరికాదని

జవహర్‌రెడ్డి చెప్పారు. 

దేశంలోనే అత్యధికంగా టెస్టులు చేసే రాష్ట్రంగా ఏపీ నిలిచిందని.. వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా 9

ల్యాబ్‌లు పనిచేస్తున్నాయని.. పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచామన్నారు. ఫిబ్రవరి 15à°¨ తిరుపతిలో రోజుకు 90 పరీక్షల సామర్థ్యం ఉండగా.. మార్చి 15 నాటికి à°† సంఖ్యను 450à°•à°¿

పెంచామన్నారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 27 మంది మృతిచెందినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం 4 కొవిడ్‌ ఆస్పత్రులు ఉన్నాయని, కర్నూలు ఆస్పత్రిని కూడా కొవిడ్

ఆస్పత్రిగా మార్చామని జవహర్‌రెడ్డి వివరించారు. అయన తెలియచేసిన వివరాలు . . . 

రాష్ట్రం లో 181 క్లస్టర్ లు ఉన్నాయి.... 121 అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో 60 

66 శాతం

క్లస్టర్ లు అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయి

181 క్లస్టర్ లు 103 మండలాల్లో ఉన్నాయి.... 56 రెడ్, 47 ఆరెంజ్, 573 మండలాలు గ్రీన్ 

అత్యధిక కేసులు నాలుగు జిల్లాలో

ఉన్నాయి 

టెస్టింగ్ కెపాసిటీ గణనీయంగా పెంచాం 

ఈరోజు వరకు 48 వేల కోవిడ్ పరీక్షలు నిర్వహించాం 

ప్రస్తుతం 9 ల్యాబ్స్ పని చేస్తున్నాయి 

225 ట్రూ

నాట్ మిషన్ లు 49 ల్యాబ్స్ ఉన్నాయి 

మొత్తం రోజుకు 6980 యాంటీ జెన్ టెస్ట్ లు చేసే సామర్ధ్యం ఉంది 

ప్రతి పది లక్షల మందికి 961 పరీక్షలు చేస్తున్నాం... 2011 జనాబా

లెక్కల ప్రకారం 

ప్రస్తుత జనాబా లెక్కల ప్రకారం కూడా 900 పరీక్షలు నిర్వహిస్తున్నాం.... ప్రస్తుతం 5.3 కోట్లతో మంది జనాబా ఉన్నారు 

కర్నూల్ ఆసుపత్రిని కూడా

కొవిడ్ ఆసుపత్రిగా మారుస్తున్నాం 

పేషంట్ మేనేజ్మెంట్ కు ప్రత్యేక అప్లికేషన్ పెట్టాం 

ప్రతి హాస్పిటల్ నుండి కంట్రోల్ రూం కి వీడియో కాన్ఫరెన్స్

ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశాం 

తెలిమేడిసిన్ లో ఇప్పటికి 306 మంది డాక్టర్ లు వాలెంట్రీగా సేవ చేస్తున్నారు 

4000 పైగా కన్సల్టేషన్ లు జరిపాం 

కొత్తగా

సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చాం

పిపిఈ లు 3 లక్షల పైగా ఉన్నాయి. 1.4 లక్షల N95 మాస్కులు అందుబాటులో ఉన్నాయి 

ప్రతి వ్యక్తికి మూడు మాస్కుల పంపిణీ

చేస్తున్నాం 

ఆక్సిజన్ సప్లై పైన దృష్టి పెట్టాం .... ఆక్సిజన్ సప్లై లైన్ లు కొత్తగా వేస్తున్నాం

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam