DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్‌–19 పరీక్షల సంఖ్య బాగా పెరిగింది :  సీఎం వైయస్‌.జగన్‌

*రాష్ట్ర పరిస్థితులపై -నివారణా చర్యలపై అధికారులతో సమీక్ష*

*పరీక్షల సంఖ్య మరింత విస్తృతం కావాలని ఆదేశాలు..* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్,

అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 23, 2020 (డిఎన్ఎస్) : కోవిడ్‌–19 ప్రభావంతో రాష్ట్ర పరిస్థితులపై -నివారణా చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి

అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. à°ˆ సందర్బంగా ఆయన అధికారులతో పలు అంశాలపై చర్చించారు. నిన్న ఒక్కరోజే 6,520 ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేశామని అధికారులు

తెలిపారు. మొత్తంగా ఇప్పటివరకూ 48,034 పరీక్షలు చేశామని వివరించారు. ప్రతి మిలియన్‌కు 961 టెస్టులతో దేశంలోనే తొలి స్థానంలో రాష్ట్రం ఉందన్నారు. రానున్న రోజుల్లో

మరిన్ని పరీక్షలతో మరింత మెరుగుపడతామని వివరించారు. కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్‌ టెస్టు కిట్స్‌కు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చిందని తెలిపారు. నిర్దేశించిన

ప్రోటోకాల్‌ ప్రకారం ర్యాపిడ్‌ టెస్టు కిట్స్‌తో పరీక్షలు జరుగుతాయని, ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్స్‌తో ఇప్పటివరకూ 14,423 పరీక్షలు చేపట్టామని, వీటిల్లో 11,543 టెస్టులు

రెడ్‌జోన్లలోనే ఉన్నాయన్నారు. à°ˆ మొత్తం పరీక్షల్లో సుమారు 30కిపైగా పాజిటివ్‌లు ర్యాండమ్‌ కిట్లలో వచ్చాయని వివరించారు. 

వీటి నిర్ధారణ కోసం పీసీఆర్‌

టెస్టులకు పంపుతున్నామని, కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్‌ టెస్టు కిట్ల పనితీరు బాగుందన్నారు. టెలిమెడిసిన్‌ ద్వారా వైద్య సలహా తీసుకున్న వారికి మందులు కూడా

పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్న అధికారులు
సింగపూర్,  à°šà±ˆà°¨à°¾à°²à±à°²à±‹ మరోసారి వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైందన్న అధికారులు

జులైలో మరో సర్వే: . .

.

తలసేమియా, క్యాన్సర్, డయాలసిస్‌ లాంటి వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం
వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని అధికారులను సీఎం

ఆదేశించారు. 104కు కాల్‌చేస్తే వెంటనే స్పందించేలా ఉండాలన్నారు. ఎమర్జెన్సీ కేసులకు ఇబ్బంది రాకుండా చూడాలని తెలిపారు. డెలివరీ కేసులకు ఇబ్బంది రాకుండా

చూడాలని,  à°ªà±à°°à°¤à°¿à°ªà°¾à°¦à°¿à°¤ కొత్త మెడికల్‌ కాలేజీలకు వెంటనేస్థలాలను గుర్తించాలని వివరించారు. 

ఎవరికి ఏ సమస్య ఉన్నా 1902కు కాల్‌ చేయాలనీ సూచించారు. గ్రామాల్లోని

రైతులు అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ను సంప్రదించాలని, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ద్వారా పంటలు పరిస్థితులు,  à°§à°°à°² పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి

నివేదించవచ్చన్నారు. à°ˆ సమాచారం ఆధారంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 
 
రూ. 100లకు వివిధ రకాల పండ్లు... ఇవ్వటాన్ని కొనసాగించాలని,  à°¦à±€à°¨à±à°¨à°¿

శాశ్వత ప్రాతిపదికన ముందుకు సాగేలా చూడాలన్న సూచించారు. 

తప్పుడు కథనాలపై సమావేశంలో చర్చ :

పత్రికల్లో తప్పుడు కథనాలపై సమావేశంలో చర్చ నిర్వహించారు.

గుంటూరు జిల్లా ఈపూరు మండలంలో బొల్లా వీరాంజనేయలు రొంపిచర్ల మండలం విప్పర్ల రెడ్డిపాలెంలో కర్బూజా పంట పొలంలో వదిలేశారంటూ వచ్చిన కథనంతోపాటు, కడప నుంచి

తెప్పించిన అరటి విజయవాడలో రైతుబజార్లకు చేరక కుళ్లిపోతున్నాయంటూ ప్రచురించిన కథనాలపై చర్చ.
ఈరెండూ తప్పుడు సమాచారంగా అధికారులు నివేదించారు. 

కర్బూజా

పంట పండించిన  à°°à±ˆà°¤à± కుటుంబంతో మాట్లాడామని నివేదించిన అధికారులు
రెండు కోతలు కోసి పంటను ఇప్పటికే తీసుకున్నామని, గిట్టుబాటు రేటు కూడా తీసుకున్నామని, మూడో

కోతలో నాసిరకం కాయలు కారణంగా వదిలేశామని, వాటిని తరలిస్తే రవాణా ఖర్చులు కూడా రావని ఆ కుటుంబం తెలిపినట్టుగా చెప్పిన అధికారులు.
విజయవాడలో అరటిగెలలు కూడా కడప

నుంచి తెప్పించి, స్థానిక మార్కెట్లకు పంపించామని, అంతేతప్ప వాటిని వదిలేయలేదన్న విషయాన్ని వెల్లడించిన అధికారులు
అలాగే కేసుల సంఖ్యను తక్కువ చేసి

చూపిస్తున్నారంటూ, అధికారులు అధికారికంగా సమాచారం ఇవ్వకపోయినా ఇష్టం వచ్చినట్టు కేసుల సంఖ్యను, మరణాల సంఖ్యను చూపిస్తున్నారని సమావేశంలో చర్చ జరిపారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam