DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హోమ్ క్వారంటైన్లపై జిఓ ఫెన్సింగ్ టెక్నాలజీ యాప్ తో పర్యవేక్షణ 

*పోలీస్ శాఖ సాంకేతికత బృందాన్నిడిజిపి అభినందనలు.*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 24, 2020 (డిఎన్ఎస్) :  à°ªà±à°°à°ªà°‚à°š దేశాలను

వణికిస్తున్న కరోనా వైరస్ నుండి ప్రజలను కాపాడేందుకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో పోలీసు శాఖ అన్ని చర్యలను తీసుకొంటోంది.

 à°…ందులో భాగంగా వివిధ దేశాల నుండి ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చిన పౌరుల కోసం అత్యంత సాంకేతికత పరిజ్ఞానంతో దేశంలోనే మొదటిసారిగా హోం క్వారం టెన్ లో ఉండేవారికోసం

జియో ఫెన్సింగ్ టెక్నాలజీ అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ అప్లికేషన్ లో మొత్తం 22,478 మంది నమోదు చేసుకున్నారు. ఇరవై ఎనిమిది రోజులపాటు ఈ

అప్లికేషన్ ద్వారా వారిపైన నిఘా ఏర్పాటు చేశాము. à°ˆ యాప్ లో  à°¨à°®à±‹à°¦à± చేసుకున్న వారిలో 3043 మంది  à°œà°¿à°¯à±‹ ఫెన్సింగ్ టెక్నాలజీ నిబంధనలు ఉల్లంఘించడంతో వారిపైన కేసులు

నమోదు చేశాము. ఈ యాప్ లో నమోదు చేసుకున్న నాటినుండి నిన్నటి వరకు ఇరవై ఎనిమది రోజుల హోం క్వారంటెన్ పూర్తి కోవడంతో వారిపైన ఉన్న ప్రత్యేక ఆంక్షలను తొలగిస్తూ వారు

కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు సాధారణ ప్రజలతో కలసి బయట తిరిగేందుకు వెసులుబాటు కల్పించడం జరిగింది. ఈ యాప్ ద్వారా అత్యధికంగా తూర్పు గోదావరి,

విశాఖ పట్నం జిల్లాలలో ఎక్కువ మందిపై  à°¨à°¿à°˜à°¾ పెట్టడం జరిగింది. 

ఈ సందర్భంగా సాంకేతిక పరిజ్ఞానంతో జియో ఫెన్సింగ్ టెక్నాలజీ ను అభివృద్ధి చేసిన అధికారులను

 à°†à°‚ధ్ర ప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు అభినందించారు. త్వరలోనే రెడ్ జోన్ ఏరియా à°² నుండి బయటకు రాకుండా ఉండేందుకు సాంకేతికత పరిజ్ఞానంతో మరో  à°®à±Šà°¬à±ˆà°²à± యాప్ ను

రూపొందించే పనిలో పోలీస్ శాఖ ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ విదేశాల నుండి వచ్చిన వ్యక్తులు పోలీస్ శాఖ కు సహకరించడం వారి దేశ

భక్తికి నిదర్శనమని, అట్టివారికి సర్వదా రుణ పడి ఉంటామనీ తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam