DNS Media | Latest News, Breaking News And Update In Telugu

26 న అరసవల్లి ఆలయంలో వైనతేయ ఇష్టి: ప్రధాన అర్చకులు శంకర శర్మ

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 24, 2020 (డిఎన్ఎస్) : సర్వ జన సంక్షేమం కోసం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ

స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో గల అనివెట్టి మండపం నందు "వైనతేయ (గరుడ) ఇష్టి హావనం వేద వేదాంగ వేత్తల చే, పండిత ప్రకాండల చే ఈ నెల 26 న ఉదయం 8గంటలకి

నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు.  
ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ఆయన మాట్లాడుతూ ఈ ప్రత్యేక పూజలు చేయడం వలన " ఆపదుద్ధారణ" విష

జ్వరాది ప్రాణాంతక రోగ నిర్మూలన తద్వారా ప్రాణులకు స్వస్థత చేకూరుతుందని అని ఆయన పేర్కొన్నారు. సంబంధిత మంత్రాలతో వేద ఋక్కులతో అధర్వణ వేద సూక్తము లతో గరుడ హోమ

గుండముతో ఆయా నిర్ణీత హావన ద్రవ్యములతో నిర్ణీత సమయంలో హవనం జరుగుతాయని చెప్పారు. గత నెల 22 నుంచి ఆలయంలో ప్రతి రోజూ ఏకాంతంలో సేవలు నిర్వహిస్తున్నామని, లోక

కళ్యాణం కోసం అరుణ హోమం, హవనం, జపం, సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణాలు యధావిధిగా సాగుతున్నాయన్నారు. 

సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి వి హరి

సూర్య ప్రకాష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి మధ్య కనీస దూరాన్ని పాటించి నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పారు. ఈ

కార్యక్రమాలను టీవీలోనూ వీక్షించి భక్తులు ధరించాలని వారు కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య రక్షణ చర్యల్లో భాగంగా మీడియా వారిని సైతం అనుమతించడం లేదని,

వారు అందిస్తున్న ప్రచారానికి అనువుగా ఉండే విధంగా ఆలయం నుంచే ఫోటోలను, వీడియో లను దేవస్థానమే పంపుతోందన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam