DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లంక గ్రామాల ప్రజలకు ఎంపీ భరత్ నిత్యావసరాల పంపిణీ

(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 24, 2020 (డిఎన్ఎస్) : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రామకృష్ణ మఠం వద్ద ఇసుక రాంప్ నుండి

పడవల మీద పాత బ్రిడ్జి లంక కు వెళ్లి అక్కడ నివసిస్తున్న మత్స్యకార్మికుల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు,

వైస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్, కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఈ కుటుంబాలు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకుని తన సొంత ఖర్చులతో

నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అక్కడ నివసిస్తున్న ప్రతీ కుటుంబాన్ని స్వయంగా కలిసి వారి సమస్యలు తెలుసుకుని నేను మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన

పార్లమెంట్ సభ్యులు, సుమారు 150 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారని, పిల్లల్ని కలసి వారిక్షేమం తెలుసుకుని బయటకు రావొద్దని ఇంటిదగ్గరే ఉండాలని సూచించారు.

రాజమండ్రి లో కరోనా కేసులు పెరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తముగా ఉండాలని ఇంటి నుండి బయటకు రావొద్దని, రెడ్ జోన్ లో వున్న ప్రజలు ఆందోళన చెందవద్దని వైస్సార్సీపీ

ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తుందని స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటామని, ఏ ఇబ్బంది వున్న తమకు

తెలియచేయాలని పార్లమెంట్ సభ్యులు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులతో పాటు మాజీ శాసన సభ్యులు రౌతు సూర్య ప్రకాశరావు, మత్స్యకార్మికుల 5 గ్రామాల

అధ్యక్షులు మల్లాది ఆంజనేయులు, అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, కొంచ సత్య, మార్గాని సురేష్, కడియాల లక్ష్మణరావు, నిచ్చెనకోళ్ల సుబ్బారావు, బుడ్డిగ శ్రీను,

మణికంఠరెడ్డి, రవి, చైతన్య, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam