DNS Media | Latest News, Breaking News And Update In Telugu

9 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఒరిస్సా కు...పాదచారులై.. 

*à°ˆ వలస కూలీల నడక ఇంటి గూటికి చేరేనా ?* 

*5 రోజులుగా ఆహారం లేకున్నా. ఆగుతూ నడుస్తూ. .* 

*ఐదు జిల్లాలు ఎలా దాటారు వీళ్ళు ? పోలీస్ సిబ్బంది తనిఖీ లేదా?* 

*(DNS

రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి )..*

అమరావతి, ఏప్రిల్ 24, 2020 (డిఎన్ఎస్) : లాక్ డౌన్ నేపథ్యంలో ఉన్న పని ఊడిపోయి, నిలువ నీడ లేక, తినడానికి ఆహారం లేని

స్థితిలో ఎటూ తోచక నడక తోనే ఇంటి బాట పట్టిన వలస కూలీలా భాద వర్ణనాతీతం. హైద్రాబాద్ నుంచి గత ఐదు రోజుల క్రితం బయలు దేరిన శ్రీకాకుళం - ఒరిస్సా సరిహద్దు

ప్రాంతానికి చెందిన నలుగురు వలస కూలీలు మార్గ మధ్యంలో పలు కష్టాలు పడుతూ శుక్రవారం నాటికి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చేరుకున్నారు.

రాజమహేంద్రవరం సమీపంలోని చెముడులంక 
జాతీయ రహదారి పై నడుస్తూ వెళ్లడం à°¡à°¿ ఎన్ ఎస్ ప్రతినిధి  à°•à°¿ కన్పించారు. వారిని ఆపి వివరాలు అడిగీతే బోర్ మన్నారు. వీరిలో

ఇద్దరు హైదరాబాదు నుంచి తొమ్మిది రోజుల క్రితం వారి సొంతం రాష్ట్రం ఒడిషా నడచి వెళ్లడానికి బయలు దేరారన్నారు. మార్గ మధ్యంలో పలు చోట్ల పోలీసులు సిబ్బంది ఆపి,

ఆహారం అందించి, అక్కడే రెండు రోజుల పాటు నిలువరించారని, తదుపరి బ్రతిమాలితే ముందుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. వారి వద్ద చిల్లు గవ్వ లేకపోవడంతో

రావులపాలెం సమీపంలో ఒకరు à°†à°¹à°¾à°° పదార్థం తో పాటు వంద రూపాయిలు చొప్పున ఇచ్చి పంపించారని తెలిపారు.  

ఇక మిగిలిన ఇద్దరూ హైదరాబాదు సమీపంలో నల్గొండ జిల్లా

భువనగిరి నుంచి రెండు రోజుల క్రితం బయలుదేరారని తెలిపారు. ఇచ్చాపురం నుండి రైస్ మిల్లులో పనిచేయడానికి వీరు వెళ్లారు. లాక్ డౌన్ వల్ల రైస్ మిల్లు నడవడం లేదు. మీరు

వెళ్లిపోండని యజమాని చెప్పడంతో నడక మొదలు పెట్టారు. మద్యలో కొందరు వాహన దారులు ఎక్కించుకుని కొంత దూరం తీసుకొచ్చారంట. వీరి పరిస్థితి చూసి మద్దిరెడ్డి

వెంకటేశ్వరరావు (లాడెన్), బండారు  à°šà°¿à°¨à±à°¨à°²à± వీరికి ఏదో సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే రాజదారిపై లారీల వారి సహాయం కోరదామన్నా, ప్రస్తుత నిబంధనల ప్రకారం

లారీల్లో ప్రయాణీకులను ఎవరినీ ఎక్కించుకోకూడదు. ప్రయాణించేందుకు అనుమతి పొందిన కార్ల వంటి వాటిల్లో ఒక్కరు వెళ్తున్నట్టయితే వారితో ఇంకొకరిని

ఎక్కించుకుని అవకాశం ఉన్నందున జాతీయ రహదారిపై వేచి యున్నారు. ఇంతలోనే మరికొందరు మానవతావాదులు వీరి సాహసం విని వీరికి సహాయం చేసే ప్రయత్నం చేసారు. ఇదే సమయంలో

కొందరు మానవతా కల్గిన  à°¸à±à°¥à°¾à°¨à°¿à°•à±à°²à± కొందరు అదే బాటలో వెళ్లే ఒరిస్సా వైపు వెళ్లే లారీలను అపి, వీరి à°•à°¿ సహకరించవలసినదిగా కోరడం జరిగింది. అయితే దారిలో ఎన్నో చెక్

పోస్ట్ లు ఉన్నాయని, పైగా, లారీలో ప్రయాణీకులను ఎక్కించుకోకూడదని, డ్రైవర్లు తెలియచేసారు. 

ఇంతలో ఒడిషా మార్గం లో వెళ్లే వాహనం ( అనుమతి పొందినది ) ఒకటి

కనిపించింది. ఆ వాహనం లో ఒక్కరే ఉండడం తారసపడింది. అయితే వీళ్లకు ఆ వాహనం సహకారం లభించిందో లేదో తెలియదు కానీ, వీళ్ళ తరహాలో ఇతర రాష్ట్రాల్లోనూ, ఇతర

ప్రాంతాల్లోనూ లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయినా వేలాది మంది వలస వాదులు ఉన్న చోట ఉపాధి లేక, ఇంటి కి చేరలేక, నడిరోడ్డుపై నిలువ నీడ లేకుండా ఉండిపోయారు. వారిలో

చాలామంది నడక మార్గంలో సొంత గ్రామాలకు చేరేందుకు అడుగులు వేశారు. వీళ్ళ సాహసం ఫలించి ఇంటి బాట పట్టేనా లేదా అనేది తెలియదు. ఇదే జాతీయ రహదారి మీదుగా ఇలాంటి వలస

కూలీలు మా à°Šà°°à°¿ మీదుగా రోజూ వందలాది మంది వెళ్లడం భాద కల్గిస్తునే ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఐదు జిల్లాలు ఎలా దాటారు వీళ్ళు ?. .

.

హైదరాబాద్ నుంచి ఆంధ్ర లోకి అడుగుపెట్టాలంటే అంతర్ రాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి, ఆంధ్రాలో అంతర్ జిల్లాల సరిహద్దులు ఉన్నాయి.  à°‡à°µà°¨à±à°¨à±€ దాటితేనే గానీ వీళ్ళు

తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టలేరు. అలాంటిది ఇన్ని చోట్ల పోలీస్ చెక్ పోస్ట్ లు లేవా? లేక వాళ్ళు వీళ్ళని గమనించలేదా అనేది తెలియాలి.  à°—à°¤ నెల 24 తర్వాత

తెలంగాణ నుంచి ఆంధ్ర లో అడుగు పెట్టడానికి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులను ఆంధ్ర లో అడుగు పెడితే క్వారంటైన్ లోకి పంపుతాము అని ఆంధ్ర ప్రభుత్వం, పోలీసులు

హెచ్చరించడం పెద్ద దుమారాన్నే లేపింది.  à°®à°°à°¿ అలాంటి పొలిసు యంత్రాంగం అత్యంత సునాయాసం à°—à°¾ జిల్లాల బోర్డర్లు దాటేస్తున్న వలస కూలీలను ఎలా వదిలి పెడుతున్నట్టో

వాళ్ళకే తెలియాలి.?

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam