DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్ధరాత్రి దేశ ప్రజలకు కేంద్రం శుభవార్త - దుకాణాలు తెరవ వచ్చు 

*షరతులు కచ్చితంగా పాటించాలి:  à°¹à±‹à°‚శాఖ కార్యదర్శి అజయ్ భల్లా* 

*రాష్ట్రాల అనుమతి తప్పని సరి, మాస్క్ లు, దూరం తప్పని సరి* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్

కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 25, 2020 (డిఎన్ఎస్) : గత నెలన్నర రోజులుగా కరోనా మహమ్మారి ప్రభావంతో అస్తవ్యస్తమైన దేశ ఆర్ధిక వ్యవస్థ ను తిరిగి

నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ నిబంధనల కారణంగా తెరవలేకపోతున్న దుకాణాలన్నింటినీ తెరుచుకోవచ్చని

కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సంతకం చేసిన ఈ ఉత్తర్వులను శుక్రవారం అర్దరాత్రి విడుదల చేసింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని షాపులూ తెరచుకోవచ్చని

తెలిపింది. ఐతే... కొన్ని కండీషన్లు పెట్టింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవొచ్చని తెలిపింది. 

ఐతే... ఆయా

రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాలకుల అనుమతి తప్పనిసరి. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకూ సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది కాబట్టి...

తెలంగాణలో కేంద్రం రూల్ వర్తించదు. అదే ఏపీలో కేంద్ర వెసులుబాట్లు అమల్లో ఉన్నాయి కాబట్టి ఏపీలో అన్ని షాపులూ తెరచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఇస్తే... కేంద్ర చెప్పిన కండీషన్ల ప్రకారం షాపులు తెరచుకోవచ్చు. ఐతే... దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ మాత్రం తెరవడానికి వీల్లేదు.

మరో ముఖ్య విషయమేంటంటే... హాట్

స్పాట్లు, కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నచోట మాత్రం ఏ రాష్ట్రంలోనైనా సరే, షాపులు తెరవడానికి వీల్లేదు. ఇప్పటివరకూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కిరాణా షాపులు, నిత్యవసర,

అత్యవసర, మందులు, ఫార్మసీ షాపులు మాత్రమే తెరవొచ్చని కండీషన్ పెట్టింది. 

ఇప్పుడు మాత్రం అన్ని రకాల షాపులూ తెరచుకోవచ్చు. అంటే స్టేషనరీ షాపులు, బ్యూటీ

సెలూన్స్, డ్రై క్లీనర్స్, ఎలక్ట్రికల్ స్టోర్స్ వంటివి అన్నీ తెరచుకోవచ్చు. ఐతే... రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి ఉండాలి. అలాగే... ఇదివరకట్లా అందరు ఉద్యోగులూ ఆ

షాపుల్లో ఉండకూడదు. 

సగం మంది ఉద్యోగులతోనే నడపాలి. అలాగే సోషల్ డిస్టాన్స్ మెయింటేన్ చెయ్యాలి. అలాగే అందరూ మాస్కులు తప్పనిసరిగా

ధరించాలి.

ఇండియాలో ఇప్పుడిప్పుడే కరోనా జోరందుకుంటోంది. శుక్రవారం ఒక్క రోజే 1752 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 23452కి చేరింది. వీరిలో 4814 మంది

మాత్రం పూర్తిగా రికవరీ అయ్యారు. ఇక శుక్రవారం కొత్తగా 37 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 723కి చేరింది.

కేంద్రం మార్చి 24à°¨ తొలిసారి లాక్‌డౌన్ ప్రకటించింది.

అది ఏప్రిల్ 14à°¨ ముగిసింది. దాన్ని పొడిగిస్తూ... మే 3 వరకూ లాక్‌డౌన్ ప్రకటించింది. ఐతే... లాక్‌డౌన్ మొదలై 30 రోజులు పూర్తవడంతో... కేంద్రం à°ˆ తాజా సడలింపులు

ప్రకటించింది.

à°ˆ ఉత్తర్వులను ఏ రాష్ట్రం ఎలా పాటిస్తుంది అనేది ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam