DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలం చందన యాత్ర కు భక్తులు ప్రాధాన్యం కాదు, రసీదులే ముఖ్యం  

*ఆలయాల ద్వారాలు మూసేసారు -  à°†à°¨à± లైన్ అకౌంట్లు తెరిచేసారు.*

*ఆన్ లైన్ లో పే చెయ్యండి - సింహాచల ఆలయంలో సేవలు పొందండి*  

*దర్శనం ఎలాగూ లేదు, మీ పేరిట జరిగే

అర్చనకైనా ముందుకు రండి*
  
*దేవాదాయ శాఖ ఆలయాల్లోనూ ఆన్ లైన్ వసూళ్లు అమలు  à°§à°¾à°°à±à°®à°¿à°• వర్గాలు.* 

*సింహాచలం ఆన్ లైన్ ఫోన్ పే, బ్యాంకు అకౌంట్ వివరాలు ఇవే. .

.*

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .

విశాఖపట్నం, ఏప్రిల్ 25, 2020 (డిఎన్ఎస్) : దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని

దేవాలయాలూ భక్తుల రాకను నిషేధించాయి. విశాఖ సాగర తీర సమీపాన సింహాచల క్షేత్రం లో వెలసిన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దివ్యక్షేత్రంలో కూడా భక్తులకు

ద్వారాలు మూసుకుపోయాయి. 

ఆలయాల ద్వారాలు మూసేసారు -  à°†à°¨à± లైన్ అకౌంట్లు తెరిచేసారు. .

ప్రస్తుతం హిందూ దేవాలయాలన్నీ భక్తులకు కోసం పూర్తి గా

మూసుకుపోయాయి అయితే వాళ్ళ నుంచి విరాళాలు, అర్చన టికెట్ల కోసం వసూళ్లు మాత్రం ఇబ్బడి ముబ్బడి గా ఆన్ లైన్ ద్వారా వసూలు చేసేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్

లోని దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాల్లోనూ భక్తులకు ద్వారాలు మూసేసారు, భక్తుల నుంచి అర్చనలు పేరిట వసూళ్లు మాత్రం భారీ గా మొదలు

పెట్టేసారు. 

ప్రస్తుతం సింహాచలం, కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఇలా అన్ని ఆలయాలూ భక్తులకు విరాళాలు, పరోక్ష అర్చనలకు విరాళాలను, ఫోన్ పే, బ్యాంకు

అకౌంట్ లు అన్ని మార్గాలనూ ఇబ్బడి ముబ్బడి గా వినియోగించుకుంటున్నాయి. వీళ్లెవరికీ భక్తులు ప్రాధాన్యం కాదు, కేవలం వాళ్ళు ఇచ్చే విరాళాలు ముఖ్యంగా ఉన్నాయి.

అసలు భక్తులకు ప్రవేశం లేని సమయంలో వాళ్ళ నుంచి విరాళాలు ఎందుకు వసూలు చేస్తున్నట్టు అనేది దేవాదాయ శాఖ చెప్పాల్సి ఉంది. ఇది కచ్చితంగా హిందూ భక్తుల మనోభావాలతో

దేవాదాయ శాఖ వ్యాపారం చెయ్యడమే అని ధార్మిక వర్గాలు మండిపడుతున్నాయి. 

సింహాచలం చందన యాత్ర తో  à°®à±Šà°¦à°²à± : . . .

ఈ సమయంలోనే వైశాఖ శుద్ధ తదియ ( అక్షయ తృతీయ) రోజు

 à°à°¡à°¾à°¦à°¿ à°•à°¿ ఒక్కసారే లభించే స్వామి నిజరూప దర్శనం చందన ఉత్సవం కూడా రావడంతో ప్రభుత్వ ఆదేశాల నిబంధనల ప్రకారం à°ˆ వేడుకలను కూడా ఏమాత్రం ఆర్భాటం లేకుండా ఏకాంతంలో

నిర్వహిస్తున్నారు.  

దర్శనం ఎలాగూ లేదు, ఆలయంలో పరోక్ష అర్చనల్లో పాల్గొనండి: . .. 

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో భక్తులకు స్వామి నిజరూప దర్శనం ఎలాగూ

లభించడం లేదు, కనుక కనీసం వీరి పేరిట గర్భాలయంలో అర్చనల్లో పరోక్షంగా పాల్గొనవచ్చని సింహాచల దేవస్థానం పిలుపు ఇచ్చింది. దీనిలో భాగంగా భక్తులు ఆన్ లైన్ ద్వారా

నిర్దేశిత రుసుము చెల్లించవచ్చని తెలిపింది. అక్షయ తృతీయ రోజు ఆలయంలో జరిగే అర్చనల్లో పాల్గొనాలంటే రూ. 500 లను చెల్లించవచ్చని తెలిపింది. ఇలా చెల్లించిన రుసుమును

సంబంధించిన రశీదును దేవస్థానం వారి వాట్స్ అప్ నెంబర్ కు పంపవలసి ఉంటుంది.    

ఒక కేజీ చందన సమర్పణకు రూ. 20 వేలు చెల్లించాలన్నారు. అరకేజీ చందనానికి రూ. 10 వేలు

చెల్లించవచ్చన్నారు.  

à°ˆ చెల్లింపులను  à°«à±‹à°¨à± పే : eosvlnsd@sbi లేదా 

ఆన్ లైన్ బ్యాంకు అకౌంట్ ట్రాన్స్ ఫర్  à°•à± అకౌంట్ నెంబర్ : 11257208642,. . ..  
IFSC Code :SBIN0002795 ద్వారా చెల్లించమని

సూచించారు. 

అదే విధంగా చందనోత్సవ సమయంలో ప్రత్యక పూజ కోసం రూ. 500/- లను  à°«à±‹à°¨à± పే eosvlnsd@sbi ద్వారా చెల్లించమనవి. 

మీరు చెల్లించిన వివరములు ఈ దేవస్థానం నెంబర్ 9949725433 కి

వాట్స్ అప్ ద్వారా చెల్లించే అవకాశం ఉంది. 

*దేవాదాయ శాఖ కు భక్తులు అవసరం కాదా. ..  à°°à°¸à±€à°¦à±à°²à± ముఖ్యమా?* 

భక్తులు రావద్దు అంటూ దేవాదాయ శాఖ హిందూ దేవాలయాల

తలుపులను భక్తుల కోసమో పూర్తిగా మూసేసింది. ఆలయాల్లో ఆరాధనలు, అర్చనలు కేవలం ఏకాంతంలోనే జరుగుతాయి అని ప్రకటించేసింది. భక్తులు అవసరం లేని దేవాదాయ శాఖ భక్తుల

నుంచి చందాలు, విరాళాలు, అర్చన టికెట్లు ఎలా కోరుతోంది అనేది ధార్మిక వర్గాలు వేస్తున్న ప్రశ్న. 

దశాబ్దాల కాలంపాటు రాష్ట్రంలోని హిందూ దేవాలయాలను హిందూ

భక్తులు తమ విరాళాలు, అర్చనాది టికెట్ల కొనుగోలు తోనూ పోషించారు. అలాంటిది ఇప్పుడు మొత్తం సమాజం మొత్తం విపత్కర స్థితిలో ఉన్నందున భక్తులందరి క్షేమం కోసం వారి

పేరిట ఆలయాల్లో ఉచితంగా అర్చనలు, ఆరాధనలు చెయ్యవచ్చని, అలా దేవాదాయ శాఖ ఎందుకు ఆదేశించలేదని ధార్మిక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam