DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అష్టదిబంధంలో పాతపట్నం ప్రాంతం:శ్రీకాకుళం కలెక్టర్ నివాస్

పాతపట్నంలో మూడు పాజిటివ్, కంటైన్మెంటు లో 18 గ్రామాలు*

*à°ˆ ప్రాంతంలో  à°ªà±à°°à°œà°²à± ఎవరూ బయటకు రావద్దు అని ఆదేశాలు* 

*ఇళ్లు దాటి బయటకు రాకూడదని హెచ్చరికలు

అమలు*

(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ , శ్రీకాకుళం ). . .

శ్రీకాకుళం, ఏప్రిల్ 25, 2020 (డిఎన్ఎస్) : à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా పాతపట్నం మండలంలో 18 గ్రామాల్లో లాక్ డౌన్

కఠినంగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ జె నివాస్ స్పష్టం చేసారు. జిల్లాలో ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ అని తేలిన నేపధ్యంలో జిల్లా కలెక్టర్ నివాస్

శని వారం స్పందిస్తూ వివరాలు అందించారు. 

పాతపట్నం మండలానికి చెందిన ఒక వ్యక్తి ఢిల్లీ నుండి వచ్చారని చెప్పారు. ఆ వ్యక్తికి గురువారం స్ధానికంగా పరీక్షలు

చేయగా పాజిటివ్ గా వచ్చిందని, కాకినాడ తుది ఫలితాల కోసం పంపించగా నెగిటివ్ వచ్చిందని చెప్పారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని

తెలిపారు. ఆ వ్యక్తితో కాంటాక్ట్ లో ఉన్న 29 మందిని ప్రాథమికంగా పరీక్షించగా ముగ్గురుకి పాజిటివ్ గా తేలిందని అన్నారు. మరో వ్యక్తికి స్ధానికంగా పాజిటివ్

వచ్చిందని తుది ఫలితాల్లో నిర్ధారణ కావల్సి ఉందని కలెక్టర్ చెప్పారు. 

కోవిడ్ సోకిన వ్యక్తులకు మర్కజ్ తో సంబంధం లేదని అయితే ఢిల్లీ నుండి వచ్చిన వ్యక్తి

అని పేర్కొంటూ 211 మంది ఢిల్లీ నుండి మార్చి 20వ తేదీ ఆ తరువాత వచ్చిన వారిని గుర్తించి అప్పుడే హోమ్ ఐసోలేషన్ లో పెట్టామని చెప్పారు. వారందరిని ప్రత్యేకంగా

పర్యవేక్షణ చేసామని పేర్కొన్నారు. ఈ వ్యక్తికి కూడా ఐసోలేషన్ అనంతరం పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా వచ్చిందని చెప్పారు. జిల్లాకు ఢిల్లీ, ముంబాయి తదితర ఇతర

ప్రాంతాల నుండి 13,500 మంది వచ్చారని వారందరినీ హోమ్ ఐసోలేషన్ లో పెట్టామని పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబాయి తదితర ప్రాంతాల నుండి వచ్చిన వ్యక్తులు ఇక మీదట కూడా

ఇళ్ళల్లోనే ఉండాలని ఆయన కోరారు. కరోనా లక్షణాలు ఉంటే స్ధానిక ఆశా కార్యకర్త, ఏ.ఎన్.ఎం లకు తక్షణం తెలియజేయాలని ఆయన అన్నారు. ప్రస్తుతం తేలిన కేసును పరిశీలిస్తే

ఎక్కువ మందికి కరోనా వైరస్ సోకే అవకాశం లేదని భావిస్తున్నామని అన్నారు. మండల స్దాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామని, సంబందిత రెవిన్యూ, వైద్య, పంచాయతీరాజ్,

గ్రామీణ నీటి సరఫరా విభాగం, తదితర శాఖల అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అందరూ స్వీయ నియంత్రణలో ఉండాలని, పూర్తి సహాయ సహకారాలు

అందించాలని కలెక్టర్ కోరారు. ప్రతి ఒక్కరూ ఇంట్లేనే ఉండాలని భద్రంగా ఉండాలని పిలుపునిచ్చారు.

18 గ్రామాల్లో కంటైన్మెంటు- ఇల్లు దాటి రాకూడదు: . .

.

పాతపట్నంతోపాటు కాగువాడ, సీది, కొరసవాడ చుట్టు ప్రక్కల 18 గ్రామాలకు పూర్తిగా లాక్ డౌన్ చేసామని, పూర్తిగా కంటైన్మెంటు జోన్ గా కఠినంగా అమలు చేస్తామని

కలెక్టర్ నివాస్ స్పష్టం చేసారు. ఈ గ్రామాలకు అన్ని కాయగూరలు, కిరాణా, మందులు, సరుకులు, తాగు నీరు డోర్ డెలివరీ ద్వారా అందిస్తాం. పశువులకు కూడా అక్కడే ఆహారం

అందించాలని, ఏ ఒక్కరూ బయటకు రావడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఏ ఒక్కరూ బయటకు రావడానికి వీల్లేదని స్పష్టం చేసారు. ఎవరి ఇళ్ళల్లో వాళ్లే ఉండాలని, ప్రక్క

ఇంటివారితో కూడా మాట్లాడకూడదని ఆదేశించారు.

పాతపట్నం కు ప్రత్యేక బృందాలు :

పాతపట్నంతోపాటు ఇతర గ్రామాల్లో ఇంటింటి సర్వే చేయుటకు ప్రత్యేక వైద్య

బృందాలను 23 మంది వైద్యులు, 2 వందల మంది ఆశా కార్యకర్తలతో ఏర్పాటు చేసామన్నారు. క్షేత్ర స్ధాయిలో పూర్తిగా గాలిస్తాయని చెప్పారు. ఎవరైనా ఉంటే వారిని క్వారంటీన్ లో

పెడతామని అన్నారు. జిల్లాలో కరోనా పరిస్ధితిని ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ పేర్కొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam