DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వనాల్లో నుంచి  గోదావరి లంక ల్లోకి వన్యప్రాణులు ఆగమనం. . .

*జన సంచారం లేక  à°¯à°§à±‡à°šà±à°šà°—à°¾ జంతువుల జీవన విహారం* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 26, 2020 (డిఎన్ఎస్) : కరోనా మహమ్మారి

రాక్షసుడు విజృంభించకుండా లాక్ డౌన్ అమలు చేయడంతో వనాల్లో ఉండవలసిన వన్యప్రాణుల జనావాసాల మధ్యకు వస్తున్నాయి. జన సంచారం ఎక్కడా బయట కనపడక పోవడంతో జంతు జలాలు

యధేచ్చగా స్వైర విహారం చేస్తూ జన జీవన వలయాల్లోకి వచ్చేస్తున్నాయి. తిరుమల ఆలయ పరిసరాల్లోకి ఏకంగా దుప్పులు, ఈనాలుగు బంట్లు, చిరుతలు వచ్చిన వైనాన్ని అందరూ

చూసారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా లంక గ్రామాల్లోకి జింకలు వచ్చి చేరుతున్నాయి. 
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజి దిగువన లంకల్లో ఇసుక తిన్నెల

మధ్య మొలిచే చెంగలిదుబ్బిల చిగుళ్ళు తింటూ చెంగు చెంగున గెంతులేసుకుంటూ తిరిగే కృష్ణ జింకలు బయటకు వస్తున్నాయి.ఈ లంకల్లో వందలాది జింకలు ఉన్నాయి. అయితే ఇవి

జనాలకు చిక్కకుండా గోదావరి పాయ మధ్యలోనే జీవనం సాగిస్తాయి. కాని జనతాకిడి తగ్గిపోవటంతో బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. శనివారం కడియం మండలం బుర్రిలంక సమీపంలో

మూడేళ్ల జింక బయటకు రావడంతో కుక్కలు దాడి చేశాయి. ఇది గమనించిన ఓ రైతు ఆ జింకను కాపాడి కడియం పశువుల ఆసుపత్రికి తీసుకొచ్చారు. డాక్టర్ కల్లూరి సత్యనారాయణ ఆ

జింకకు వైద్యం చేయడంతో క్షేమంగా ఉంది. దానిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఇటీవలి ఈ లంకల్లో జింకల సంఖ్య విపరీతంగా పెరగడంతో కొందరు బోట్లుపై లంకల్లోకి

విహార యాత్ర పేరుతో వెళ్ళి వాటిని వేటాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు ఈ జింకల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వన్యప్రాణి ప్రేమికులు

కోరుతున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam