DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగద్రక్షకుని సేవలో  జనరక్షక అధిపతి 

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిజిపి ఆర్ పి ఠాకూర్.

తిరుమల,జులై 3 2018 (DNS Online ): సర్వ జగద్రక్షుడైన తిరుమల శ్రీనివాసుని ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరక్టర్ జనరల్ ఆర్

పి ఠాకూర్  à°¦à°°à±à°¶à°¿à°‚చుకున్నారు. మంగళవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానముల అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి బ్రేక్ దర్శనం సమయం లో

స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా తిరుమల ఆలయ ప్రాశస్త్యాన్ని, చరిత్రను, ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల తిరుమల పై వెల్లువవుతున్న

పలు వివాదాల నేపధ్యం లో రాష్ట్ర డిజిపి గా నియమితులైన ఆర్ పీ ఠాకూర్ ఆలయా భద్రతకు మరింత శ్రద్ధ పెడతామని తెలియచేసారు. అనంతరం ఠాకూర్ దంపతులకు అర్చకులు రంగనాయక

మండపంలో ఆశీర్వచనం చేయగా, టీటీడీ జె ఈఓ కె.శ్రీనివాసరాజు స్వామివారి చిత్తరువు, ప్రసాదాలు అందచేశారు. నూతన డిజిపి గా నియమితులైన ఠాకూర్ సోమవారం రాత్రి

తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు స్వాగగతంపలికి ప్రసాదాలు అందచేశారు. రాష్త్ర డిజిపి వెంట

చిత్తూరు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మంగళవారం రాష్ట్రం లోని ప్రస్తుత పరిస్థితులపై విలేకరుల సమావేశం లో ప్రస్తావించారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam