DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేవాదాయ కమిషనర్ సీటు కావాలంటే రాజకీయ పలుకుబడి తప్పని సరి

*దేవాదాయ కమిషనర్ గా నూతన నియామకం ఎవరికీ?*

*శాఖాపరమైన ఒత్తిళ్లు తట్టుకుంటే. . సీటు నిలబడినట్టే. . .*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). .

.*

అమరావతి, ఏప్రిల్ 29, 2020 (డిఎన్ఎస్): రాష్ట్రం లో అత్యంత ప్రాధాన్యత కల్గిన విభాగాల్లో దేవాదాయ శాఖా ఒకటిగా ప్రాధాన్యత ఏర్పరుచుకుంది. ఈ శాఖలో కమిషనర్ లు గా

భాద్యతలు చేపట్టిన వారికి తర్వాత కాలంలో ఉన్నత అధికారం లభిస్తుంది అనే నమ్మకం చాలా మంది అధికారుల్లోనూ ఉంది. ప్రస్తుతం దేవాదాయ శాఖా కమిషనర్ గా భాద్యతలు

నిర్వహిస్తున్న డాక్టర్ ఎం. పద్మ గురువారం పదవి విరమణ చెయ్యనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇప్పడికే

రాష్ట్రం లోని చాలా దేవాలయాల్లో రాజకీయ ప్రభావం పెరిగిన కారణంగా ఈ పోస్టు లోకి వచ్చే వ్యక్తి కచ్చితంగా స్వామి భక్తి కలిగి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇప్పడికే కొందరు రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరికొందరు విజయ సాయి రెడ్డి టిటిడి చైర్మన్ ఎస్ వి

సుబ్బారెడ్డి లను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరు ఈ సీటులోకి వచ్చినా దేవాదాయ శాఖను ఏమాత్రం సరిదిద్దలేరు అన్నది మాత్రం వాస్తవం. నూతన నియామకం పై బుధవారం

à°’à°• ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam